సుమ‌న్ బాలీవుడ్ ఎంట్రీ!!

ప్రముఖ న‌టుడు సుమ‌న్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. `ఠాగూర్‌` రీమేక్‌గా తెర‌కెక్క‌బోతున్న `గ‌బ్బర్‌`లో  మెయిన్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు. అక్షయ్‌కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది.  Advertisement రాధాకృష్ణ జాగ‌ర్లమూడి ( క్రిష్)…

ప్రముఖ న‌టుడు సుమ‌న్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. `ఠాగూర్‌` రీమేక్‌గా తెర‌కెక్క‌బోతున్న `గ‌బ్బర్‌`లో  మెయిన్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు. అక్షయ్‌కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 

రాధాకృష్ణ జాగ‌ర్లమూడి ( క్రిష్) ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఇందులో శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ర‌మ‌ణ పేరుతో త‌మిళంలో తెర‌కెక్కిన ఓ చిత్రం తెలుగులో ఠాగూర్‌గా రీమేక్ అయ్యింది. ఇప్పుడు హిందీలో గ‌బ్బర్‌గా తెర‌కెక్కుతోంది. 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో పెద్దయెత్తున్న విజ‌యాన్ని సొంతం చేసుకొన్న ఈ చిత్రం హిందీలో ఎలాంటి ఫ‌లితాన్ని తీసుకొస్తుందో చూడాలి. తెలుగువాడైన యువ ద‌ర్శకుడు క్రిష్‌కి ఇది తొలి హిందీ చిత్రం కావ‌డం విశేషం.