Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమ్ముడికి ప్రేమతో...

తమ్ముడికి ప్రేమతో...

పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ '143' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. 'బంపర్‌ ఆఫర్‌' సినిమాతో హిట్‌ అందుకున్నాడుగానీ, కెరీర్‌లో మళ్ళీ ఇంకో హిట్‌ లేదు. ప్రస్తుతం 'అరకు రోడ్‌లో' అనే సినిమా చేస్తున్నాడు. ఇదో థ్రిల్లర్‌ సినిమా అట. ఈ సినిమా తర్వాత సాయిరాం శంకర్‌తో పూరి జగన్నాథ్‌ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 

కళ్యాణ్‌రామ్‌తో 'ఇజం' సినిమా తెరకెక్కిస్తున్న పూరి జగన్నాథ్‌, తన సోదరుడు సాయిరాం శంకర్‌ కోసం మాంఛి పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ని రెడీ చేశాడట. అయితే అందులో సాయిరాం శంకర్‌ హీరోగా కాదు, విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎలాగూ నిలదొక్కుకోలేకపోతుండడంతో విలన్‌గా ట్రై చేస్తే బెటరని పూరి జగన్నాథ్‌ స్వయంగా సాయిరాం శంకర్‌కి సలహా ఇచ్చాడట. 

గోపీచంద్‌ హీరోగా ట్రై చేసి, ఫెయిలయ్యాక విలన్‌గా నటించి, మళ్ళీ హీరోగా అవకాశాలు సాధించి, మాస్‌ హీరోగా ఎదిగిన విషయం విదితమే. ఆ టైపులోనే సాయిరాం శంకర్‌కి హిట్టివ్వాలని పూరి ప్రయత్నిస్తున్నాడట. ఓ ప్రముఖ హీరోతో త్వరలో తెరకెక్కించనున్న సినిమాలో సాయిరాం శంకర్‌ విలన్‌గా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. 'ఇజం' విడుదలయ్యాక ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్‌ వుంటుందట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?