Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగు తెరకు సుక్కూ కానుక

తెలుగు తెరకు సుక్కూ కానుక

అసలే హీరోయిన్లు లేక టాలీవుడ్ కిందా మీదా అవుతోంది. కొత్త హీరోయిన్లను చిన్న సినిమాలకు పరిచయం చేసినా తగిన గుర్తింపు రావడం లేదు. పెద్ద డైరక్టర్లు, హీరోలు కాస్త నోటెడ్ హీరోయిన్ల కేసే చూస్తున్నారు తప్ప, కొత్త హీరొయిన్లను తీసుకు రావడం లేదు. 

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ తన ఆధ్వర్యంలో తయారయ్యే ఉప్పెన సినిమా కోసం ఓ కొత్త అమ్మాయిని తీసుకువచ్చారు. మంగుళూరుకు చెందిన కీర్తి శెట్టి ని తన శిష్యుడు బుచ్చిబాబు డైరక్షన్లో నిర్మించే సినిమా కోసం తీసుకువచ్చారు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో హీరో. మైత్రీ మూవీస్ నిర్మాణ భాగస్వామి.

కీర్తి శెట్టిని చూస్తుంటే తెలుగు తెరకు ఓ కొత్త హీరోయిన్ దొరికినట్లే కనిపిస్తోంది. కనుముక్కుతీరుగా వున్న ఈ అమ్మాయి టాప్ హీరోల పక్కన చాన్స్ ల సంగతి ఎలా వున్నా, చాలా మంది యంగ్ హీరోల పక్కన పక్కాగా సూట్ అయ్యేలా కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?