తట్టుకోలేని కష్టమిది…

సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ తనయుడు, సినీ నిర్మాత జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య జానకీరామ్‌ అంత్యక్రియలు జరిగాయి. పెద్ద కుమారుడి…

సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ తనయుడు, సినీ నిర్మాత జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య జానకీరామ్‌ అంత్యక్రియలు జరిగాయి. పెద్ద కుమారుడి మరణాన్ని చూసి నిన్న గుండెలవిసేలా రోదించిన హరికృష్ణ, అంత్యక్రియలు జరుగుతున్నంతసేపూ కన్నీరుమున్నీరవుతూనే వున్నారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జానకీరామ్‌ పార్దీవ దేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అందరితోనూ కలుపుగోలుగా వుండే వ్యక్తికి తట్టుకోలేని కష్టమొచ్చిందని అన్నారు సినీ నటుడు చిరంజీవి. కార్లలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం ద్వారా ప్రాణాలు నిలుపుకోవచ్చనీ, దయచేసి ప్రతి ఒక్కరూ తన విజ్ఞప్తిని మన్నించాలని చిరంజీవి కోరారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జానకీరామ్‌ అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. జానకీరామ్‌ కుమారుడు, తండ్రికి చితికి నిప్పంటించాడు.