Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తిరిగి తిరిగి చైతన్య దగ్గరకే

తిరిగి తిరిగి చైతన్య దగ్గరకే

మొత్తం మీద మళ్లీ బయలుదేరిన దగ్గరకే వచ్చేసారు దర్శకుడు పరుశురామ్ అని ఇండస్ట్రీ లో లేటెస్ట్ కబురు. నాగ్ చైతన్యతో సినిమా అనుకుని, ఆ తరువాత ఒక్కో హీరో దగ్గరకి వెళ్లి వస్తున్నారు పరుశురామ్.

మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, నాని, అఖిల్, ఇలా టచ్ చేయని హీరో లేరు అని టాక్. కానీ ఎవ్వరూ డేట్ లు ఇవ్వలేదు. వాళ్లకు ఖాళీ లేదో? లేక ఈయన చెప్పిన లైన్లు సూట్ కాలేదో? ఆఖరికి ఇప్పుడు నాగ్ చైతన్య దగ్గరే సెటిల్ అయ్యేలా వుంది వ్యవహారం అనిపిస్తోంది.

ఓ సినిమా చేయడానికి చైతన్య ఓకె అన్నారని, అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా క్లారిటచీ లేదని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తో సినిమా పూర్తి చేయాల్సి వుంది. అది పూర్తి కావడానికి ఇంకా కాస్త ఎక్కువ టైమ్ నే పడుతుంది. మరి అప్పటి వరకు పరుశురామ్ వెయిట్ చేస్తారా? అన్నది చూడాలి. 

శెేఖర్ కమ్ముల-చైతన్య కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తున్న నిర్మాత ఏషియన్  సునీల్ నే ఈ సినిమాను కూడా నిర్మిస్తారని బోగట్టా. అంటే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఒకెే నిర్మాతకు చైతన్య చేస్తాడన్నమాట.

ఈ ప్రాజెక్టుకు  పరుశురామ్ తన రెమ్యూనిరేషన్ తొమ్మిది కోట్ల మేరకు ఫిక్స్ చేసుకున్నారని వినిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?