వెంకీ సినిమాకు ముగ్గురు నిర్మాతలు?

దృశ్యం, గోపాల గోపాల సినిమాలతో తనేంటో మళ్లీ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు వెంకీ. సరైన సబ్జెక్ట్ దొరికితే వెంకీకి సరైన బిజినెస్ వుందని స్పష్టమైంది. అందుకే వెంకీకి హ్యాండ్ ఫుల్ అసైన్ మెంట్లు డిస్కషన్…

దృశ్యం, గోపాల గోపాల సినిమాలతో తనేంటో మళ్లీ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు వెంకీ. సరైన సబ్జెక్ట్ దొరికితే వెంకీకి సరైన బిజినెస్ వుందని స్పష్టమైంది. అందుకే వెంకీకి హ్యాండ్ ఫుల్ అసైన్ మెంట్లు డిస్కషన్ లో వున్నాయని వినికిడి.

గతంలో వెంకీతో ఓ సినిమా చేయాలని దర్శకుడుు మారుతి  అనుకున్నా, మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు మరో లైన్ ఓకె అయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే అటు వెంకీకి కమిట్ మెంట్లు వున్నాయి. ఇటు మారుతికి వున్నాయి. అయితే ఎప్పుడు తీసినా, ఈ సినిమా తీయడానికి ముగ్గరు నిర్మాతలు ముందుకు వస్తున్నారట.

వెంకీ అన్న సురేష్ తన స్వంత బ్యానర్ పైనే చేద్దాం అనుకుంటున్నాడట. మరోపక్క హారిక హాసిని రాధాకృష్ణ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. వీరికి తోడు అల్లు అరవింద్ కూడా వెంకీ ఓకె అంటే తాను చేస్తానని అంటున్నారట. మొత్తానికి ఒకరు సమర్పణ..ఇద్దరు నిర్మాతలు అవుతారమో?