విడుదలకు ముందే ‘విన్నర్’

భలే మంచి చౌకబేరము అన్నట్లు నాలుగున్నర కొట్లకు ఓవర్ సీస్ హక్కులు. అది కూడా రెండు సినిమాలు. గోపీచంద్ మలినేని-సాయి ధరమ్ విన్నర్, శ్రీనువైట్ల-వరుణ్ తేజ మిస్టర్. రెండింటి ఓవర్ సీస్ హక్కులు కలిపి…

భలే మంచి చౌకబేరము అన్నట్లు నాలుగున్నర కొట్లకు ఓవర్ సీస్ హక్కులు. అది కూడా రెండు సినిమాలు. గోపీచంద్ మలినేని-సాయి ధరమ్ విన్నర్, శ్రీనువైట్ల-వరుణ్ తేజ మిస్టర్. రెండింటి ఓవర్ సీస్ హక్కులు కలిపి నాలుగున్నర కోట్లకు మైత్రీ మూవీస్ నవీన్ తీసుకున్నారు.

ఇప్పుడు హ్యాపీగా మారుబేరానికి తెలుగు ఫిల్మ్ నగర్ అనే సంస్థకు అమ్మేసారు. ఈ మారు బేరంలో నవీన్ కోటి రూపాయలకు పైగానే లాభం చేసుకున్నారని వినిపిస్తోంది. రెండూ మీడియం రేంజ్ సినిమాలే కానీ, ఇద్దరు డైరక్టర్లు ప్రూవ్ చేసుకున్నవారే. పైగా శ్రీను వైట్ల సినిమా అంటే ఓవర్ సీస్ లో కొంత ఫిక్స్ డ్ మార్కెట్ వుంది. 

అదీ కాక మిస్టర్ సినిమా టీజర్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మాంచి ఆఫర్ రావడంతోనే హ్యాపీగా క్యాష్ చేసేసుకున్నారు నవీన్.మూడు నెలల కిందట పెట్టిన పెట్టుబడి ఇప్పుడు లాభాలు తెచ్చేసింది విడదలకు ముందే.