Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విజయవాడలో అడియో, వైజాగ్ లో ఫంక్షన్

విజయవాడలో అడియో, వైజాగ్ లో ఫంక్షన్

సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తోంది పంతం టీమ్ తమ సినిమా విడుదల జూలై 5న అని. అయితే ఇదిగో అదిగో రెండు సినిమాలు, ఎంచి ఎంచి గోపీచంద్ పంతం సినిమా మీద పడ్డాయి. తేజ్ ఐ లవ్ యూ, అలాగే విజేత సినిమాలు వచ్చి పడ్డాయి.

అయినా గోపీచంద్ 'పంతం' వెనక్కుతగ్గడం లేదు. ఈ నెలాఖరులో విజయవాడలో అడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. మరోపక్క విడుదల దగ్గర చేసి, విశాఖలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడానికి రెడీ అవుతోంది.

తేజ్ ఐ లవ్ యూ ఇప్పటికే విశాఖలో ఫంక్షన్ కు రెడీ అయిపోయింది. హైదరాబాద్ లో ఫంక్షన్ ముగిసిపోయింది.  వాస్తవానికి అది టూ ఎర్లీ అనుకోవాలి. ఎందుకంటే సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు టైమ్ వుంది. రిలీజ్ ప్లానింగ్, బిజినెస్ పెర్ ఫెక్ట్ గా లేక, ముందుగానే ఫంక్షన్ లు అన్నీ ఫినిష్ చేసుకున్నారు.

విజేత సినిమా పబ్లిసిటీ స్టార్ట్ కావాల్సి వుంది. మెగా అల్లుడి మొదటి సినిమా కాబట్టి, మెగాస్టార్ రంగంలోకి దిగుతారు. ఆయన ఫ్యాన్స్ కూడా హల్ చల్ చేసే అవకాశం వుంది. ఈ సినిమాకు కూడా ఓ ఫంక్షన్ తిరుపతిలో చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 

టోటల్ గా చూసుకుంటే ఖాళీగా వున్న డేట్ లు అన్నీ అలా వదిలేసి, సినిమాలన్నీ ఒకేసారి కుమ్మేసుకోవడానికి రెడీ అయినట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?