సంక్రాంతిని ‘​టచ్​’​ చేస్తాడా?

సంక్రాంతికి ఇప్పటికే బాలయ్య, పవన్ సినిమాలు ఫిక్స్ అయ్యాయి. బాలకృష్ణ నటిస్తున్న జై సింహా జనవరి 12న, పవన్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10న థియేటర్లలోకి రావడం పక్కా. ఈ రెండు సినిమాల మధ్యలో…

సంక్రాంతికి ఇప్పటికే బాలయ్య, పవన్ సినిమాలు ఫిక్స్ అయ్యాయి. బాలకృష్ణ నటిస్తున్న జై సింహా జనవరి 12న, పవన్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10న థియేటర్లలోకి రావడం పక్కా. ఈ రెండు సినిమాల మధ్యలో సూర్య, విశాల్ కూడా తమ సినిమాల్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. సరే.. ఈ రెండు డబ్బింగ్ సినిమాల్ని పక్కనపెడితే.. మెయిన్ బాక్సాఫీస్ వార్ మాత్రం బాలయ్య, పవన్ మధ్యే ఉండబోతోంది. మరి ఇలాంటి టైమ్ లో రవితేజ లీగ్ లోకి ఎంటర్ అవుతాడా..?

రాజా ది గ్రేట్ సక్సెస్ తో ఊపుమీదున్న రవితేజ.. తన అప్ కమింగ్ మూవీ టచ్ చేసి చూడు చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. దాదాపు మేకర్స్ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. కానీ రవితేజ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని వెనక ముఖ్యంగా 2కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటి రీజన్ ఏంటంటే.. టచ్ చేసి చూడు ఔట్ పుట్ పై అంత సంతృప్తిగా లేడు రవితేజ. ఎలాగూ చేయిదాటిపోయింది కాబట్టి సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఇలాంటి మూవీని సంక్రాంతికి తీసుకొస్తే భారీ కాంపిటిషన్ మధ్య మొదటికే మోసం రావొచ్చు.

ఇక రెండో రీజన్ ఏంటంటే.. ఎలాగూ సినిమాపై సంతృప్తిగా లేడు కాబట్టి ఎక్కువ థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తే కనీసం ఓపెనింగ్స్ అయినా తెచ్చుకోవచ్చు. సంక్రాంతికి సినిమాను తీసుకొస్తే ఎక్కువ థియేటర్లు దొరకవు. సో.. ఎలా చూసుకున్నా రవితేజ సంక్రాంతిని టచ్ చేయకపోవచ్చు.

విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. రాశిఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు.