Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రచయిత వక్కంతం కు కరోనా?

రచయిత వక్కంతం కు కరోనా?

కరోనా కల్లోలం ఆగడం లేదు. టాలీవుడ్ లోని ప్రతి యూనిట్ ను టచ్ చేస్తోంది లేటెస్ట్ గా హీరో అఖిల్ సినిమా యూనిట్ ను టచ్ చేసినట్లు బోగట్టా. 

ఎకె సంస్థ హీరో అఖిల్ తో డైరక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ ప్రీ ప్రొడక్షన్ మీద వర్క్ చేస్తోంది. అయితే యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో వర్క్ వాయిదా పడినట్లు బోగట్టా.

ఈ సినిమాకు కథ, రచన సహకారం వక్కంతం వంశీ అందిస్తున్నారు. ఆయన కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఎందుకంటే టీమ్ తో కలిసి పని చేస్తూ వచ్చారు కనుక. 

ఇదిలా వుంటే నితిన్ అంథాదూన్ రీమేక ప్రాజెక్టు సినిమాటోగ్రాఫర్ యువరాజ్ కు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది దాంతో ఆ సినిమా వర్క్ కూడా ఆగింది. మొత్తం మీద కరోనా కల్లోలం టాలీవుడ్ ను కుదిపేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?