ఏరు దాటిన తరువాత..?

ఛలో సినిమాతో ఎక్కడ లేని బజ్ వచ్చింది తొలిసారి నాగశౌర్య సినిమాకు. థాంక్స్ టు పబ్లిసిటీ టీమ్. అయితే సెన్సారు అయిన తరువాత ప్రొడక్ట్ కూడా బాగానే వుందని టాక్ వచ్చింది. దాంతో జనాల్లో…

ఛలో సినిమాతో ఎక్కడ లేని బజ్ వచ్చింది తొలిసారి నాగశౌర్య సినిమాకు. థాంక్స్ టు పబ్లిసిటీ టీమ్. అయితే సెన్సారు అయిన తరువాత ప్రొడక్ట్ కూడా బాగానే వుందని టాక్ వచ్చింది. దాంతో జనాల్లో కాస్త ఆసక్తి పెరిగింది.

అయితే దీనంతంటికి అసలు కారణం, డైరక్టర్ వెంకీ కుడుముల. అతగాడు తీసుకువచ్చిన కథకు పెట్టుబడి పెట్టి సినిమా తీసింది నిర్మాత శంకర్ ప్రసాద్ నే కావచ్చు. కానీ కెమేరామెన్ సాయి శ్రీరామ్ తో కలిసి కష్టపడి, ఆరోగ్యం కూడా కాస్త పాడుచేసుకుని సినిమా తయారుచేసింది మాత్రం డైరక్టర్ నే.

కానీ ఇప్పుడు పబ్లిసిటీ అంతా నాగశౌర్య చుట్టూనే తిప్పుతున్నారట. జిల్లా టూర్లయితేనేం, ఆడియో ఫంక్షన్ అయితేనేం, దర్శకుడిని కాస్త సైడ్ లైన్ చేసారని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయట. దీనికి ఆ డైరక్టర్ కూడా కాస్త ఫీలవుతున్నట్లు బోగట్టా.

అయితే ఛలో ఇన్ సైడ్ టాక్ తెలిసిన ఒకటి రెండు బ్యానర్లు అప్పుడే అతగాడి చేతిలో అడ్వాన్స్ పెట్టడానికి ఆలోచిస్తున్నాయి. ఓసారి కనిపించమని గీతా నుంచి డైరక్టర్ కు కబురు అందినట్లు తెలుస్తోంది. మంచి సబ్జెక్ట్ వుంటే అల్లు శిరీష్ కోసం లాక్ చేస్తారేమో? మరో నిర్మాత బెల్లంకొండ కూడా ఈ దర్శకుడి మీద కన్నేసినట్లు తెలుస్తోంది.