Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎవడు తర్వాతేదీ ఫిక్స్‌ కాలేదు

ఎవడు తర్వాతేదీ ఫిక్స్‌ కాలేదు

‘ఎవడు’తో విజయాన్ని సొంతం చేసుకున్న వంశీ పైడిపల్లి మలి చిత్రం కూడా దిల్‌ రాజు బ్యానర్‌లోనే ఉంటుందని వార్తలొస్తున్నాయి. దిల్‌ రాజుకి అతనో కథ చెప్పాడని, అది దిల్‌ రాజుకి నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. అలాగే పైడిపల్లితో ఒక హిట్‌ సినిమాలో నటించిన హీరోతో మరో సినిమా ఉంటుందని కూడా వినిపిస్తోంది. 

అయితే తన తదుపరి సినిమా ఏమిటనేది, ఎవరితో అనేది, ఏ బ్యానర్‌ అనేది... ఏదీ ఫిక్స్‌ కాలేదని వంశీ పైడిపల్లి ‘గ్రేట్‌ఆంధ్ర’తో చెప్పాడు. ‘ఎవడు’ ప్రమోషన్‌ కార్యక్రమాలతోనే ఇంతకాలం బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి ఇకపై కథపై కసరత్తు మొదలు పెడతాడట. లైన్‌ రెడీ అయిన తర్వాతే ఎవరిని అప్రోచ్‌ అవ్వాలనేది ఆలోచిస్తాడట. 

సినిమా కనుక కన్‌ఫర్మ్‌ అయితే తానే స్వయంగా చెప్తానని, అందాకా ఏమీ ఊహించుకోవద్దని వంశీ పైడిపల్లి ఈ సందర్భంగా మీడియాని కోరాడు. వరుసగా రెండు కమర్షియల్‌ హిట్స్‌ ఇచ్చిన పైడిపల్లి వంశీ హ్యాట్రిక్‌ హిట్స్‌ సాధించే అవకాశాన్ని మిస్‌ చేసుకోకూడదని మంచి కథ రెడీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?