14 రీల్స్ కు మళ్లీ హ్యాండేనా?

గీత గోవిందం హిట్ కొట్టిన తరువాత మహేష్ బాబు దొరకగానే నాగ్ చైతన్య కు హ్యాండ్ ఇచ్చి అటు వెళ్లిపోయాడు డైరక్టర్ పరుశురామ్. ఇలా జ‌రగడం వెనుక నిర్మాత అల్లు అరవింద్ వున్నారు. అల్లు…

గీత గోవిందం హిట్ కొట్టిన తరువాత మహేష్ బాబు దొరకగానే నాగ్ చైతన్య కు హ్యాండ్ ఇచ్చి అటు వెళ్లిపోయాడు డైరక్టర్ పరుశురామ్. ఇలా జ‌రగడం వెనుక నిర్మాత అల్లు అరవింద్ వున్నారు. అల్లు అరవింద్ ఓ కథను మహేష్ కోసం పరుశురామ్ తో చేయించాలనుకున్నారు. దాంతో పరుశురామ్ కు అటు లింక్ దొరికింది. సరే ఆ సినిమా అనుకున్న మేరకు ఆడలేదు. పరుశురామ్ డేట్ లు తమ దగ్గర వున్నా ఏదో చిన్న కంపెన్సషన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది 14రీల్స్ సంస్థ. అదంతా వేరే సంగతి.

ఆ సినిమా తరువాత అయినా 14 రీల్స్ తో సినిమా చేస్తాడా పరుశురామ్ అంటే మళ్లీ డౌట్ గానే వుంది. ఇప్పటి వరకు నాగ్ చైతన్య కథ ఓకె చేయలేదు. ఇదిగో వింటా..అదిగో వింటా అనే పద్దతిలో సాగుతోంది వ్యవహారం. వెంకట్ ప్రభుతో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు నాగ్ చైతన్య. ఈ సినిమా తరువాత మరే సినిమా చేస్తాడు అన్నది ఇప్పటి వరకు అయితే నిర్ణయం లేదు. కేవలం పరుశురామ్ కే కాదు మరో ఇద్దరు డైరక్టర్ల స్క్రిప్ట్ లు కూడా వినే వ్యవహారం జ‌రుగుతోంది.

మరోపక్కన పరుశురామ్ గీతా లో ‘చుట్టాలబ్బాయి’ లాంటి ఫ్యామిలీ స్టోరీ ఒకటి దుమ్ము దులిపి రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. పనిలో పనిగా బాలయ్యకు నిర్మాత అరవింద్ కోసం కథ రెడీ చేస్తున్నా అని ఓపెన్ డయాస్ మీదే చెప్పారు. బాలయ్య కూడా రెడీ చేయమనడం, ఆ కథలో తనకు ఓ చిన్న పాత్ర ఇవ్వమని అల్లు శిరీష్ అడగడం ఇవన్నీ చూస్తుంటే…వెనుక ఏదో జ‌రుగుతోందని అర్థం అయిపోతోంది.

పరుశురామ్ ను బాలయ్య తీసుకెళ్లిపోతే 14రీల్స్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే బాలయ్య దగ్గర 14 రీల్స్ కాదనే పరిస్థితి లేదు. మళ్లీ చిన్న కంపెన్సషన్ తో సరిపెట్టుకోవాల్సిందే. కానీ ఒకటే ఆశ. డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో అనిల్ రావిపూడి సినిమా చేస్తారు బాలయ్య. ఆ వేళకు ఎన్నికలు దగ్గరకు వస్తే, బోయపాటి రెడీ అయిపోతే అటు వెళ్తారు. కాస్త గ్యాప్ వస్తే మాత్రం పరుశురామ్ కు చాన్స్ తగలొచ్చు.

ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఒక్కటే…బాలయ్యకు సన్నిహితమైన నిర్మాత, తనకు అడ్వాన్స్ ఇచ్చిన సంస్థ 14 రీల్స్ వుండగా, పరుశురామ్ అటు కాకుండా ఇకు అరవింద్ తో వెళ్లడం ఏమిటి? అన్నదే.