2018 కేరళ వరదల నేపథ్యంలో అల్లుకున్న కథతో తయారైన సినిమా 2018. గత నెలలో మలయాళంలో విడుదలై సంచలనాలు నమోదు చేసిందీ సినిమా. వంద కోట్లకు పైగా వసూలు చేసిందని వార్తలు వినిపించాయి. ఈ సినిమా ఆల్ రెడీ ఓటిటిలోకి వచ్చింది. చూసిన వాళ్లు సూపర్ అనడమూ వినిపించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
నిర్మాత బన్నీ వాస్ తొలిసారి తానే స్వంతంగా 2018 సినిమాను తెలుగు నాట విడుదల చేస్తున్నారు. అయితే పెద్దగా గ్యాప్ లేకుండా జస్ట్ వన్ వీక్ టైమ్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 26న విడుదలవుతుంది. అంటే సినిమాకు మినిమమ్ ప్రచారానికి కూడా పెద్దగా టైమ్ వుండకపోవచ్చు.
విశేషమేమిటంటే బన్నీవాస్ తనకు అన్ని విధాలా సంబంధాలున్న గీతా లేదా జిఎ2 సంస్థల నుంచి కాకుండా తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం విశేషం. తెలుగు నాట కూడా సినిమాకు మంచి ఆదరణ వుంటుందని అంచనా వేస్తున్నారు.