ఒక రాత్రికి రూ.25 లక్షలు.. త్రిషపై మరో వివాదం

మన్సూర్ అలీఖాన్, త్రిష మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. లియో సినిమాలో త్రిషను రేప్ చేసే అవకాశం తనకు రాలేదంటూ మీడియా ముందు వెటకారంగా స్పందించాడు మన్సూర్. దీనిపై చిరంజీవిలాంటి ప్రముఖులతో…

మన్సూర్ అలీఖాన్, త్రిష మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. లియో సినిమాలో త్రిషను రేప్ చేసే అవకాశం తనకు రాలేదంటూ మీడియా ముందు వెటకారంగా స్పందించాడు మన్సూర్. దీనిపై చిరంజీవిలాంటి ప్రముఖులతో పాటు చాలామంది తీవ్రంగా ఖండించారు. స్వయంగా కోర్టు ఈ విషయంలో మన్సూర్ కు మొట్టికాయలు పెట్టింది. ఇప్పుడు దీన్ని మించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు, త్రిషపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. “గతంలో గౌవత్తూరులో త్రిష ఓ ఫంక్షన్ కు హాజరైంది. స్థానిక ఎమ్మెల్యే త్రిషపై మనసుపడ్డాడు. ఒక రోజుకు 25 లక్షలు చెల్లించి త్రిషతో గడిపాడు. దానికి నేనే సాక్ష్యం” అంటూ ప్రకటించాడు.

ఈ విషయంపై త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం త్రిష వరకు వెళ్లింది. ఆమె దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయింది. నలుగురి దృష్టిని ఆకర్షించేందుకు కొంతమంది ఎంత నీచానికైనా దిగజారుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది.

సదరు నేత వ్యాఖ్యలపై త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడిపై లీగల్ చర్యకు దిగుతానని, ఇకపై ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడాలన్నా తన లీగల్ టీమ్ మాట్లాడుతుందని స్పష్టం చేసింది.

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది త్రిష. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమె మరింత బిజీ అయింది. విజయ్, చిరంజీవి లాంటి హీరోలతో సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమెపై కొంతమంది ఇలా పనిగట్టుకొని విమర్శలకు పాల్పడుతున్నారు. త్రిషకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం, ఆమె వెనక బలమైన వ్యక్తులు లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.