Advertisement

Advertisement


Home > Movies - Movie News

భార్యాభర్తలుగా మారిన హీరోహీరోయిన్లు

భార్యాభర్తలుగా మారిన హీరోహీరోయిన్లు

నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఓ ఇంటివారయ్యారు. నిన్న చెన్నైలో వీళ్లిద్దరి వివాహం సింపుల్ గా జరిగింది. ఇన్నాళ్లూ ప్రేమికులుగా కొనసాగిన ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు.

ఆది-నిక్కీ కలిసి పలు సినిమాలు చేశారు. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం అనే విషయాన్ని మాత్రం లాక్ డౌన్ టైమ్ లోనే తెలుసుకున్నారు. తామిద్దరం ఒకర్నివిడిచి ఒకరం ఉండలేమనే విషయాన్ని లాక్ డౌన్ లోనే తెలుసుకున్నామని, పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నామని నిక్కీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలా ఈ ఏడాది మార్చిలో ఆది-నిక్కీ నిశ్చితార్థం జరిగింది. అది కూడా సింపుల్ గానే జరిగింది. తమకు ఎంగేజ్ మెంట్ అయిందనే విషయాన్ని ఈ జంట స్వయంగా బయటపెట్టినంతవరకు ఎవ్వరికీ తెలియలేదు. అలా నిశ్చితార్థం నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్న ఈ జంట.. నిన్న చెన్నైలో పెళ్లి చేసుకొని ఒకటైంది. ఈ పెళ్లికి నాని, సందీప్ కిషన్, ఆర్యతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆది పినిశెట్టి, కెరీర్ లో మంచి టైమ్ లో ఉన్నాడు. కీలకమైన క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రల కోసం ఇతడ్నే సంప్రదిస్తున్నారంతా. రంగస్థలం, నిన్నుకోరి, సరైనోడు లాంటి సినిమాల్లో ఆది మంచి రోల్స్ చేశాడు. ఇప్పుడు వారియర్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు.

అటు నిక్కీ గల్రానీ కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తమిళ్, ఓ మలయాళీ సినిమా ఉన్నాయి. మరో మలయాళం సినిమా విడుదలకు సిద్ధమైంది. పెళ్లి తర్వాత చెన్నైలోనే కాపురం పెట్టబోతోంది ఈ జంట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?