Advertisement

Advertisement


Home > Movies - Movie News

తెలుగుతెరపైకి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ

తెలుగుతెరపైకి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ

ఓటీటీ రాకతో కొత్త కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి. మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో డిఫరెంట్ మూవీ తెరపైకి రాబోతోంది. ఈ కథను ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయలేదని చెబుతున్నాడు దర్శకుడు జయశంకర్. గతంలో పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. ఈసారి ఎనకమిక్ హిట్ మెన్ థీమ్ ను సెలక్ట్ చేసుకున్నాడు.

ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే, దాని ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొడితే చాలు. ఎకనమిక్ హిట్ మేన్ చేసేది ఇదే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తారనేది చాలామందికి తెలియని అంశం. ఇప్పుడిదే కాన్సెప్ట్ ను తన కొత్త సినిమా కోసం ఎంచుకున్నాడు ఈ దర్శకుడు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాను ఫిమేల్ ఓరియంటెడ్ కథగా మార్చాడు.

ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ను ముందుగా కాజల్ కు వినిపించాడు జయశంకర్. ఆమెకు కథ బాగా నచ్చింది. ఓకే కూడా చెప్పింది. కానీ అంతలోనే గర్భందాల్చడంతో ఆచార్యతో పాటు, ఈ సినిమా నుంచి కూడా తప్పుకుంది. దీంతో ఈ దర్శకుడు మరో స్టార్ హీరోయిన్ కు ఈ కథ వినిపించాడు. 

ఆమె కూడా ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ పేరును త్వరలోనే వెల్లడిస్తారు.

ప్రస్తుతం అనసూయతో ఓ సినిమా చేస్తున్నాడు జయశంకర్. ఇదొక ఆంథాలజీ మూవీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ మూవీ పూర్తయిన వెంటనే, ఎకనమిక్ హిట్ మేన్ థీమ్ తో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు. కాన్సెప్ట్ కు తగ్గట్టు ఈ సినిమాకు 'అరి' అనే టైటిల్ అనుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?