ఆచార్య..…బేరసారాలు

కొరటాల శివ-చిరు..చరణ్..పూజా హెగ్డే లాంటి భారీ కాంబినేషన్ లో తయారైన సినిమా ఆచార్య. దీని లెక్కలు, బేరసారాల ఏనాడో అయిపోయాయి.  Advertisement కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన సినిమా ఏప్రిల్ లో విడుదలకు…

కొరటాల శివ-చిరు..చరణ్..పూజా హెగ్డే లాంటి భారీ కాంబినేషన్ లో తయారైన సినిమా ఆచార్య. దీని లెక్కలు, బేరసారాల ఏనాడో అయిపోయాయి. 

కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన సినిమా ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు బయ్యర్లు రేట్ల గురించి బేరాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

నిజానికి ఆంధ్రలో టికెట్ ల సమస్య, షోల సమస్య, రేట్ల సమస్య ఏవీ లేవు. కానీ ఇది మాత్రమే పాయింట్ కాదు. సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల ఇచ్చిన అడ్వాన్స్ లకు వడ్డీలు చాలా అయ్యాయని, అందువల్ల కాస్త డిస్కౌంట్ ఇవ్వాలని బయ్యర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంకా దగ్గర దగ్గర నాలుగు వారాల సమయం వుంది కనుక, ప్రస్తుతానికి ఈ ఇష్యూ డిస్కషన్ స్టేజ్ లో నే వుంది. ఆర్ఆర్ఆర్ కు కూడా ఇలాగే అడిగారు. కానీ ఇవ్వలేదు. చివరకు జిఎస్టీ పార్ట్ మాత్రం ఇచ్చారు ఆ విధంగా 18శాతం డిస్కౌంట్ వచ్చినట్లు అయింది. ఆచార్యకు ఏం చేస్తారో చూడాలి.