అడవులకు బయల్దేరిన సుకుమార్

దర్శకుడు సుకుమార్ అడవుల బాట పట్టారు. హీరో బన్నీ తో ఆయన మైత్రీ మూవీస్ కోసం చేయబోయే సినిమా దాదాపు మూడు వంతులు అటవీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో…

దర్శకుడు సుకుమార్ అడవుల బాట పట్టారు. హీరో బన్నీ తో ఆయన మైత్రీ మూవీస్ కోసం చేయబోయే సినిమా దాదాపు మూడు వంతులు అటవీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ కథ రాసుకున్నారు. ఈ సినిమా లోకేషన్ల కోసం కేరళ అడవులను ఎంచుకున్నారు.

అందుకోసం ఆయన తన టీమ్ తో రెక్కీకి బయల్దేరారు. కేరళ-తమిళనాడు బోర్డర్ దట్టమైన అడవులకు ప్రసిద్ధి. అక్కడ షూట్ చేయాలన్నది ప్లాన్. వచ్చే నెల నుంచి షూట్ ప్రారంభమయ్యే అవకాశం వుంది. సినిమాలో హీరో బాగా రఫ్ లుక్ లో వుంటాడు. లుంగీ కట్టుకుని గడ్డం పెరిగి వుండే ఈ లుక్ కోసం ప్రస్తుతం బన్నీ గెడ్డం పెంచుతున్నారు. దాని కోసమే వెయింటింగ్.

రంగస్థలం తరువాత మళ్లీ మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకుని, రఫ్ లుక్ తో సుకుమార్ తెరకెక్కించే ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. ఎందుకంటే ఇలాగే రంగస్థలం కామ్ గా స్టార్ట్ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టారు. పైగా ఈ సబ్జెక్ట్ మహేష్ కు, ఎన్టీఆర్ కు చెప్పారు. కానీ చివరికి బన్నీకి దక్కింది. అందువల్ల ఎలా వుంటుందో అన్న క్యూరియాసిటీ ఇప్పటి నుంచే వుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ లో కృష్ణగారిది సర్‌ప్రైజ్ పాత్ర..మహేశ్‌బాబు