3 రోజుల్లో రూ.300 కోట్లు

ఓవైపు ట్రోలింగ్స్, కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ.. మరోవైపు ఆదిపురుష్ సినిమా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. భారీ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఆ ప్రభావం, ఫస్ట్ వీకెండ్…

ఓవైపు ట్రోలింగ్స్, కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ.. మరోవైపు ఆదిపురుష్ సినిమా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. భారీ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఆ ప్రభావం, ఫస్ట్ వీకెండ్ మొత్తం కనిపించింది.

విడుదలైన ఈ 3 రోజుల్లో, ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇలా 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి తన స్టామినాను చాటుకున్నాడు ప్రభాస్.

మొదటిరోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అదే ఊపులో రెండో రోజు వంద కోట్ల రూపాయలు, మూడో రోజు 90 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అలా 3 రోజుల్లో 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది ఆదిపురుష్ మూవీ.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, నిన్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 29 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా 3 రోజుల్లో, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల మార్క్ అందుకుంది.

అటు నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకుంది. ఆదివారం వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 113 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఆదివారం నార్త్ బెల్ట్ లో ఈ సినిమా అద్భుతంగా పుంజుకుంది. మొదటి రోజు, రెండో రోజు కంటే, మూడో రోజు కాస్త ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని డైలాగ్స్ ను మార్చే పని మొదలుపెట్టంది యూనిట్. అక్కడక్కడ కొన్ని కొత్త డైలాగ్స్ యాడ్ చేస్తున్నారు. కొన్ని డైలాగ్స్ ను మారుస్తున్నారు. ఈ మార్పుచేర్పులన్నీ రేపట్నుంచి థియేటర్లలో కనిపించే అవకాశం ఉంది.