ఆ సినిమా వచ్చింది.. మళ్లీ గోల మొదలైంది

హిట్టయిన సినిమాలకే ఓటీటీ కంపెనీలు కూడా ప్రచారం చేస్తాయి. ఫ్లాప్ అయితే ఎంత పెద్ద సినిమానైనా పట్టించుకోవు. సైలెంట్ గా స్ట్రీమింగ్ కు పెట్టేస్తాయి. ఆదిపురుష్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రభాస్ నటించిన…

హిట్టయిన సినిమాలకే ఓటీటీ కంపెనీలు కూడా ప్రచారం చేస్తాయి. ఫ్లాప్ అయితే ఎంత పెద్ద సినిమానైనా పట్టించుకోవు. సైలెంట్ గా స్ట్రీమింగ్ కు పెట్టేస్తాయి. ఆదిపురుష్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా ఏమాత్రం హడావిడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసినా, ప్రస్తుతం ఆదిపురుష్ పై హంగామా మాత్రం ఓ రేంజ్ లో నడుస్తోంది. థియేటర్లలో రిలీజైనప్పుడు ఎలాగైతే ఓ సెక్షన్ ఆడియన్స్, ప్రభాస్ అభిమానులు తిట్టుకున్నారో.. సేమ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ రిపీటైంది.

మరోసారి ఆదిపురుష్ యూనిట్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. క్లాసిక్ అవ్వాల్సిన సినిమాను, చెత్త గ్రాఫిక్స్, చీప్ డైలాగ్స్ తో నాశనం చేశారంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొంతమంది ఫ్యాన్స్ మాత్రం సినిమాలో ప్రభాస్ చేసిన యుద్ధాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

ఓటీటీలోకి వచ్చినప్పుడు సినిమా యూనిట్ పై మరోసారి ట్రోలింగ్ తప్పదని అంతా ముందే ఊహించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అతడు నటించిన బెస్ట్ సీన్స్ ను కట్ చేసి షేర్ చేస్తుంటే.. మిగతా జనాలు మాత్రం సైఫ్ అలీఖాన్ నటించిన సన్నివేశాల్ని కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.

ఎప్పట్లానే ఈసారి కూడా భజరంగీ హైలెట్ అయ్యాడు. వివాదాస్పదమైన ఆ సీన్ లో డైలాగ్స్ మార్చినప్పటికీ.. చాలామందికి ఇంకా కోపం చల్లారినట్టు కనిపించడం లేదు. రచయిత, దర్శకుడిపై ఇంకోసారి విరుచుకుపడుతున్నారు. ప్రభాస్ తో పాటు, టోటల్ యూనిట్ కు మరో వారం రోజులు ఈ తలనొప్పి తప్పదేమో.