Advertisement

Advertisement


Home > Movies - Movie News

కేరళలో ప్రమాదం.. 2 ముక్కలైన విమానం

కేరళలో ప్రమాదం.. 2 ముక్కలైన విమానం

కేరళలోని కోజికోడ్ లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలెట్ తో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. రన్ వే పై నుంచి విమానం జారిపడ్డమే ప్రమాదానికి కారణమని తేల్చారు.

కోజికోడ్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి విమానం పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలైంది. మరోవైపు భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

బోయింగ్ 737 రకానికి చెందిన ఈ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ కు వస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో, సిబ్బందితో కలిపి 184 మంది ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో 50 మంది తీవ్రంగా గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందంటున్నారు.

గాయపడిన వాళ్లందర్నీ కోజికోడ్ లోని వివిధ హాస్పిటల్స్ కు తరలించారు. విమాన ప్రమాదంపై డీసీజీఏ పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?