సాయితేజ్ సరసన కుస్తీ భామ

విరూపాక్ష సక్సెస్ తర్వాత సాయిదుర్గతేజ్ కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా అని ఆ సినిమాపై చర్చ పెద్దగా లేదు. సైలెంట్ గా షూటింగ్ కానిస్తున్నారు. ఇప్పుడీ సినిమా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది.…

విరూపాక్ష సక్సెస్ తర్వాత సాయిదుర్గతేజ్ కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా అని ఆ సినిమాపై చర్చ పెద్దగా లేదు. సైలెంట్ గా షూటింగ్ కానిస్తున్నారు. ఇప్పుడీ సినిమా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది.

సాయిదుర్గతేజ్ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మిని తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో ఆమె పాత్ర పేరు వసంత. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

34 ఏళ్ల ఐశ్వర్య లక్ష్మి తెలుగులో గాడ్సే సినిమా చేసింది. అయితే ఆమెకు మట్టి కుస్తీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సాయిదుర్గతేజ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. వసంత పాత్ర సినిమాలో కీలకమనే విషయం ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమౌతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కెరీర్ లో సాయిదుర్గ్ తేజ్ కు ఇది 18వ చిత్రం. రోహిత్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

2 Replies to “సాయితేజ్ సరసన కుస్తీ భామ”

Comments are closed.