Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాయి తేజ్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్

సాయి తేజ్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది రిపబ్లిక్ సినిమా. ఇందులో కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో సాయితేజ్ కు సంబంధించి ఓ వర్కింగ్ సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటనేది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ బయటపెట్టింది.

"సాయితేజ్ ఓ జెమ్‌. ఈ సినిమా కోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు. సినిమాలో ప్ర‌జ‌లు త‌రపున మాట్లాడే పాత్ర‌లో త‌ను న‌టించాడు. సినిమా షూటింగ్‌కు వెళ్ల‌డానికి ముందుగానే నేను యూనిట్‌ను క‌లిశాను. నేను, తేజ్‌, దేవ‌ క‌ట్టా.. ఇలా అంద‌రూ డిస్క‌స్ చేశాం. తేజ్ ప్ర‌తిరోజూ స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ఉద‌యం ప‌దిన్న‌ర‌కంతా వ‌చ్చేవాడు. ఓ బుక్ పెట్టుకుని అందులో డైలాగ్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. ఎంత క‌ష్ట‌ప‌డ్డారంటే ఇందులో కోర్టు రూమ్ సీన్ ఉంది. 10 నిమిషాల పాటు సాగే ఆ సీన్‌ను తేజ్ సింగిల్ టేక్‌లో చేశాడు. ఆ సీన్ త‌ర్వాత యూనిట్ అంద‌రూ క్లాప్స్ కొట్టారు. త‌న కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంద‌ని నేను భావిస్తున్నాను."

ఇలా సినిమాకు సంబంధించి సాయితేజ్ సీక్రెట్ బయటపెట్టింది ఐశ్వర్య రాజేష్. సాయి తేజ్ హార్డ్ వర్కే ఈ సినిమా సక్సెస్ సీక్రెట్ అంటోంది. రిపబ్లిక్ లో తను మైరా అనే పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది.

"నా పాత్ర విష‌యానికి వ‌స్తే నేను ఇందులో ఎన్నారై అమ్మాయిగా క‌నిపిస్తాను. ఓ స‌మ‌స్య కార‌ణంగా విదేశాల్లో ఉండే నా పాత్ర ఇండియాకు వ‌స్తుంది. రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్‌ట్రాక్ ఉండ‌దు. మెచ్యూర్డ్‌గా క‌నిపిస్తుంది. సినిమాలో ప్ర‌పోజ్ చేసే సీన్ కూడా ఉండ‌దు."

రిపబ్లిక్ సినిమా తర్వాత తెలుగులో కాస్త సినిమాలు తగ్గించబోతోందట ఐశ్వర్య రాజేష్. వరుసగా తమిళ్ లో సినిమాలు చేస్తున్నానని, ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపిస్తానని అంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?