Advertisement

Advertisement


Home > Movies - Movie News

భర్తతో విడాకులు.. శిల్పాషెట్టి ఏం చెప్పింది?

భర్తతో విడాకులు.. శిల్పాషెట్టి ఏం చెప్పింది?

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన వెంటనే అతడితో శిల్పాషెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి పుకార్లు చెలరేగాయి. వాటికి మరింత ఊతమిస్తూ అప్పట్లో శిల్పాషెట్టి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. 

సింగిల్ మదర్ గా కొనసాగే ధైర్యం, ఆర్థిక స్తోమత తనకు ఉన్నాయంటూ ఆమె గతంలో ప్రకటించింది. దీంతో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోతుందని అంతా అనుకున్నారు.

అయితే రాజ్ కుంద్రా-శిల్పాషెట్టి విడిపోవడం లేదు. తామిద్దరం ఎప్పట్లానే అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని, ఈమధ్య జరిగిన కొన్ని అవాంఛిత ఘటనల వల్ల తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాషెట్టి.

కేవలం భర్త నుంచి విడిపోయే ఆలోచన వల్లనే, మరోసారి బాలీవుడ్ లో బిజీ అవ్వడం కోసం శిల్పాషెట్టి ప్రయత్నిస్తోందనే ఊహాగానాల్ని ఈ నటి కొట్టిపారేసింది. కొన్ని ఘటనల్ని మరిచిపోవాలంటే పనిలో పడిపోవాలని, ప్రస్తుతం తను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

నీలి చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడంతో శిల్పా షెట్టి బ్రాండ్ వాల్యూ పడిపోయింది. ఆమె తన ఆదాయాన్ని కోట్లలో కోల్పోయింది. అలా కోల్పోయిన తన బ్రాండ్ వాల్యూను తిరిగి పెంచుకునే పనిలో పడింది శిల్పాషెట్టి. ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చిన రాజ్ కుంద్రా, శిల్పాషెట్టి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?