Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మళ్లీ పెళ్లి'కి లైన్ క్లియర్

'మళ్లీ పెళ్లి'కి లైన్ క్లియర్

ఊహించని విధంగా విడుదలకు కొన్ని గంటల ముందు మళ్లీ పెళ్లి సినిమాపై కోర్టు కేసు పడిన సంగతి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, హైదరాబాద్ లోని ఓ ఫ్యామిలీ కోర్టులో ఈ సినిమా ప్రసారాన్ని అడ్డుకోవాలంటూ కేసు వేశారు. దీనిపై కొన్ని గంటల వ్యవథిలోనే నరేష్ స్పందించాడు.

మళ్లీ పెళ్లి సినిమా విడుదలకు అన్ని రకాల లీగల్ అడ్డంకులు తొలిగిపోయాయని పేర్కొన్నాడు నరేష్. తమ సినిమా అనుకున్న తేదీకి, చెప్పిన టైమ్ కు థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే రమ్య రఘుపతి వేసిన పిటిషన్ ను ఎలా ఎదుర్కొన్నామనే విషయాన్ని ఆయన బయటపెట్టలేదు.

మొత్తమ్మీద నరేష్ ప్రకటనతో ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్టయింది. ఈరోజు మళ్లీ పెళ్లి సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తానని నరేష్ ప్రకటించాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడబోతున్నాడు. నరేష్ తో పాటు పవిత్ర కూడా వస్తున్నారు.

మళ్లీ పెళ్లి సినిమాలో తన పాత్ర కూడా ఉందనేది రమ్య రఘుపతి ఆరోపణ. వనిత విజయ్ కుమార్ పాత్ర ద్వారా తనను చూపించారని, తన గౌరవానికి భంగం కలిగించేలా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే అనుమానాన్ని ఆమె వ్యక్తంచేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూ, సినిమా రిలీజ్ ను అడ్డుకోవాలని ఆమె కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు.

దీన్ని నరేష్ సమర్థంగా తిప్పికొట్టినట్టు తెలుస్తోంది. గంటల వ్యవథిలోనే ఈ లీగల్ ఇష్యూ నుంచి ఆయన విజయవంతంగా బయటపడ్డారు. ఈరోజు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా చూసిన తర్వాత.. అందులో నరేష్ నిజజీవితం ఎంత ఉంది, కల్పితం ఎంత ఉందనే విషయం బయటకొస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?