విశాఖ చేరుకుంటున్న మెగా హీరోలు

మెగా కాంపౌండ్ కు చెందిన స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ విశాఖ చేరుకుంటున్నారు. బన్నీ ఆల్రెడీ ల్యాండ్ అయ్యాడు. చరణ్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నాడు. వీళ్లంతా వచ్చేది ఎన్నికల ప్రచారం కోసం…

మెగా కాంపౌండ్ కు చెందిన స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ విశాఖ చేరుకుంటున్నారు. బన్నీ ఆల్రెడీ ల్యాండ్ అయ్యాడు. చరణ్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నాడు. వీళ్లంతా వచ్చేది ఎన్నికల ప్రచారం కోసం కాదు, తమ సినిమాల షూటింగ్స్ కోసం.

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఈరోజు వైజాగ్ చేరుకున్నాడు అల్లు అర్జున్. ఎయిర్ పోర్ట్ లో అతడికి అభిమానులు ఘనస్వాగతం పలికారు.

దాదాపు వారం రోజుల పాటు విశాఖలోనే బన్నీ ఉంటాడనే ప్రచారం నడుస్తోంది. పుష్ప-2కు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ను అక్కడ పూర్తిచేయబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ఫహాద్ ఫాజిల్ కూడా జాయిన్ అవుతాడు.

ఇక రామ్ చరణ్ కూడా రేపోమాపో విశాఖలో ల్యాండ్ అవ్వబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో కొన్నేళ్లుగా గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాకు సంబంధించి విశాఖలో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు కీలక నటీనటులంతా పాల్గొంటారు.