Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ దుబాయ్ వెళ్లిన హీరో.. ఈసారి కారణం వేరు

మళ్లీ దుబాయ్ వెళ్లిన హీరో.. ఈసారి కారణం వేరు

హీరోలంతా రకరకాల దేశాలు పర్యటిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ కు మాత్రం దుబాయ్ అంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లేందుకు ఈ హీరో ఎక్కువ ఇష్టపడతాడు. ఇప్పుడు మరోసారి దుబాయ్ వెళ్లాడు బన్నీ. అయితే ఈసారి విహార యాత్రతో పాటు, మరో స్పెషల్ అకేషన్ కూడా ఉంది.

కొడుకు, కూతురు, భార్యతో కలిసి మరోసారి దుబాయ్ వెళ్లాడు అల్లు అర్జున్. దుబాయ్ లోని ఖరీదైన హోటల్ లో అతడు బస చేయబోతున్నాడు. 4 రోజుల పాటు అక్కడే కుటుంబంతో జాలీగా గడపబోతున్నాడు. అయితే దీంతో పాటు తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొంటాడు.

దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. 28వ తేదీ రాత్రి జరగనున్న ఈ మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బన్నీ ప్రత్యేక అతిథిగా హాజరవ్వబోతున్నాడు. తన మైనపు ప్రతిమ పక్కన నిల్చొని ఫొటోలకు పోజులివ్వబోతున్నాడు.

ఈసారి బన్నీ దుబాయ్ వెళ్లింది ఈ కార్యక్రమం కోసమే. కాకపోతే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కూడా కావడంతో.. ఓ 3 రోజుల ముందే దుబాయ్ లో వాలిపోయాడు ఈ స్టార్ హీరో.

ప్రస్తుతం పుష్ప-2 పనిలో బిజీగా ఉన్నాడు బన్నీ. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం, హైదరాబాద్ లో సైమల్టేనియస్ గా జరిగింది. ఏప్రిల్ రెండో వారం నుంచి మరో షెడ్యూల్ ఉంటుంది. ఈ గ్యాప్ లో దుబాయ్ లో పనులు చక్కబెట్టుకొని తిరిగొస్తాడు బన్నీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?