ఎఎంబి.. ఎఎఎ.. ఇప్పుడు ఆసియన్ రవితేజ

ఆసియన్ సినిమాస్ ఈసారి మాస్ మహరాజా రవితేజతో జతకట్టబోతోంది. గతంలో మహేష్‌తో ఏఎంబి మల్టీ ఫెక్స్ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అదే బెంగళూరులో కూడా నిర్మిస్తున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ తో ఎఎఎ…

ఆసియన్ సినిమాస్ ఈసారి మాస్ మహరాజా రవితేజతో జతకట్టబోతోంది. గతంలో మహేష్‌తో ఏఎంబి మల్టీ ఫెక్స్ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అదే బెంగళూరులో కూడా నిర్మిస్తున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ తో ఎఎఎ మల్టీ ఫ్లెక్స్ నిర్మించారు. విజయ్ దేవరకొండ తో కలిసి ఒక థియేటర్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు మాస్ మహరాజా రవితేజ వంతు వచ్చింది.

దిల్ సుఖ్ నగర్‌లో ఓ మల్టీ ఫ్లెక్స్ ను రవితేజ-ఆసియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మల్టీ ఫ్లెక్స్ లో ఆరు స్క్రీన్ లు వుంటాయి. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో వుంది. మరి కొద్ది రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఆసియన్ సినిమాస్ సంస్థ రకరకాల భాగస్వామ్యాలతో థియేటర్ల నిర్మాణం చేపడుతోంది.

గతంలో సింగిల్ స్క్రీన్ ల లీజ్ మీద దృష్ఠి పెట్టిన ఈ సంస్థ ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ ల మీద దృష్టి సారించింది. జనాల అభిరుచి మారుతుండడం వల్ల మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ లు ఎక్కువగా అక్వైర్ చేసే ఆలోచనలో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సిటీలో పలు చోట్ల మల్టీ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయబోతొంది.