శ్రీమతి రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ వేడుక ముగిసింది. రకుల్-జాకీ దంపతులుగా మారారు. గోవాలో 3 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన వీళ్ల వివాహ వేడుక ఈరోజుతో ముగిసింది. Advertisement రెండు సంప్రదాయాల్లో రకుల్-జాకీ…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ వేడుక ముగిసింది. రకుల్-జాకీ దంపతులుగా మారారు. గోవాలో 3 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన వీళ్ల వివాహ వేడుక ఈరోజుతో ముగిసింది.

రెండు సంప్రదాయాల్లో రకుల్-జాకీ పెళ్లి చేసుకున్నారు. ముందుగా సిక్కు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల వివాహం జరిగింది. దీన్ని ఆనంద్ కరాజ్ గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత సింధి సంప్రదాయంలో కూడా రకుల్-జాకీ ఒక్కటయ్యారు.

రకుల్ పెళ్లి కోసం సౌత్ గోవాలని ఐటీసీ గ్రాండ్ హోటల్ ను సుందరంగా ముస్తాబుచేశారు. ఓ రిసార్ట్ హోటల్ లోనే హల్దీ ఫంక్షన్ తో వీళ్ల పెళ్లి వేడుక మొదలైంది. ఆ తర్వాత మెహందీ, సంగీత్ వేడుకలతో సంబరాలు అంబరాన్ని తాకాయి.

స్వయంగా శిల్పాశెట్టి, రకుల్ ప్రీత్ పెళ్లి వేడుకలో డాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత వరుణ్ ధావన్ కూడా డాన్స్ చేశాడు. శిల్పాశెట్టి దంపతులతో పాటు.. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా, అనన్య పాండే, రోనిత్ రాయ్ లాంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. వీళ్లలో ఎక్కువమంది జాకీ భగ్నానీ తరఫున వచ్చినవాళ్లే ఉన్నారు.

దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు రకుల్-జాకీ. 2021 అక్టోబర్ లో తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.