టాలీవుడ్లో వారసుల ఎంట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫేస్ వ్యాల్యూతో ఆయన కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. తాజాగా మెగా కుటుంబం నుంచి మరో ఫ్యామిలీ మెంబర్ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత వెండితెర ప్రయాణం మొదలు పెట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీకి సుస్మిత కొత్త కాదు. క్యాస్టూమ్ డిజైనర్గా చిరు, చరణ్ చిత్రాలకు ఆమె పనిచేసి మన్ననలు పొందారు. ఇప్పుడామె చిత్ర పరిశ్రమలో నిర్మా తగా కొత్త అవతారం ఎత్తనున్నారు. ఇటీవల తన భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ నేతృత్వంలో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.
వెబ్ సిరీస్ అనుభవాన్ని వెండితెరపై మంచి సినిమాలు తెరకెక్కించడానికి సద్వినియోగం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా టాలీవుడ్లో తమిళ సినిమాను రీమేక్ చేయడానికి ఆమె కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా 8 తొట్టికల్ అనే తమిళ రీమేక్ హక్కులను కూడా ఆమె కొనుగోలు చేశారని సమాచారం.
సస్పెన్స్ థ్రిల్లర్ కథా నేపథ్యం ఉన్న సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సుస్మిత భావిస్తోందట. నాలుగేళ్ల క్రితం తమిళంలో విడుదలైన సినిమా విజయం సాధించింది. ఇదే సినిమా కన్నడంలో రీమేక్ అయి బంపర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు కూడా పొందేలా తెరకెక్కించాలని సుస్మిత సీరియస్గా ఆలోచిస్తున్నారు.