రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు ఇవాళ‌ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు రావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది. నటి హేమతో పాటు…

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు ఇవాళ‌ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు రావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఈ నెల 27న హేమకు విచారణ జరగనుండగా.. అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదు.

ఈ నెల 19న బెంగ‌ళూరు ఎల‌క్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఇందులో న‌టి హేమ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు ఫిర్యాదు అందింది. రేవ్ పార్టీలో పాల్గొన‌ వారందరికీ మెడిక‌ల్ టెస్ట్లు చేయ‌గా కొంత మంది డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. ఇందులో హేమ కూడా ఉన్న విష‌యం తెలిసిందే.

గ‌తంలో కూడా హేమ‌కు నోటీసులు పంప‌గా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాని విచార‌ణ‌కు రాలేన‌ని విచార‌ణ అధికారుల‌కు లేఖ రాశారు. మ‌రి ఈసారి అయినా హేమ విచార‌ణ‌కు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.