తిరిగొచ్చిన చంద్ర‌బాబు.. ఏ దేశం నుండి?

ఎన్నికల అనంతరం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ సందర్భంగా కనిపించిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఇవాళ మీడియా కంటపడ్డారు. ఇవాళ పొద్దున్నే విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమాన‌శ్ర‌మంకు…

ఎన్నికల అనంతరం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ సందర్భంగా కనిపించిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఇవాళ మీడియా కంటపడ్డారు. ఇవాళ పొద్దున్నే విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమాన‌శ్ర‌మంకు చేరుకున్నారు. 

శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా హైదరాబాద్‌లోని తాను నివాసం ఉండే గృహానికి వెళ్లారు. విదేశీ పర్యటన అన్నారు కానీ ఇంతవరకు ఆయన ఏ దేశానికి వెళ్లారు అనేది మాత్రం ఎవరికి తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేశారు. బ‌హుశా ఇంకా ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్ల‌రానే విష‌యం ఆయ‌నే ఏదో వేదిక‌లో చెప్పితే త‌ప్పా తెలిసే అవ‌కాశం లేదు.

అలాగే ఎన్నికల అనంతరం నారా లోకేష్.. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ త‌ర్వాత పవన్ కళ్యాణ్ కూడా మీడియాకు కనపడలేదు. వారు కూడా చంద్ర‌బాబు లాగా విదేశాల‌కు వెళ్లిన‌ త‌మ ప‌ర్య‌ట‌న‌ను గోప్యం ఉంచ్చారు. బహుశా వారు కూడా ఇవాళో రేపో ఏదైనా విమాన‌శ్ర‌యంలో ద‌ర్శ‌నం ఇచ్చే అవ‌కాశం ఉంది. 

కాగా సీఎం జ‌గ‌న్ కూడా ఎన్నిక‌ల అనంత‌రం విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. కాకపోతే ఆయ‌న విదేశాల‌కు వెళ్లేట‌ప్పుడు.. త‌మ పార్టీ నాయ‌కుల అంద‌రిని క‌లిసి వెళ్లారు. లండ‌న్ వెళ్లిన అనంత‌రం కూడా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క‌న‌ప‌డుతునే ఉన్నాయి. కానీ నిత్యం మీడియా ముందు క‌న‌ప‌డే లోకేశ్, చంద్ర‌బాబులు మాత్రం త‌మ ప‌ర్య‌ట‌న‌ను అత్యంత గోప్యంగా ఉంచ‌డ‌మే వింతగా ఉంది.