Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్-రాజమౌళి సినిమా ప్రకటన రాబోతోందా?

మహేష్-రాజమౌళి సినిమా ప్రకటన రాబోతోందా?

మహేష్-త్రివిక్రమ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మూవీ లాంఛ్ అయింది. త్వరలోనే అది సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరి మహేష్-రాజమౌళి సినిమా సంగతేంటి? ఈ ప్రాజెక్టు కూడా ఉందనే విషయం అందరికీ తెలుసు. 

త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి సినిమానే సెట్స్ పైకి వస్తుందనే విషయం కూడా తెలుసు. అయితే దానికి సంబంధించిన ప్రకటన ఈ నెల్లోనే వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు. ఆ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడం మహేష్ కు సెంటిమెంట్. కాబట్టి మే 31న మహేష్-రాజమౌళి సినిమాపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిజానికి మహేష్ సినిమాకు సంబంధించి రాజమౌళి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. కథ ఏంటనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కాబట్టి మే 31న ఎనౌన్స్ మెంట్ వస్తుందా అనేది అనుమానమే.

అయితే అదే రోజు మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి కచ్చితంగా అప్ డేట్ ఉండే అవకాశం ఉంది. మహేష్ ప్రీ-లుక్ లేదా రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్ తో ఓ పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు హారిక-హాసిని నిర్మాణ సంస్థ పనులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

మహేష్ మాత్రం వీటితో సంబంధం లేకుండా మరోసారి విహారయాత్రకు వెళ్లాడు. కుటుంబంతో కలిసి యూరోప్ టూర్ మొదలుపెట్టాడు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజు టైమ్ కు అతడు హైదరాబాద్ వస్తాడా, యూరోప్ లోనే ఉంటాడా అనేది ఇంకా తేలలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?