మొన్న రాజ్ తరుణ్.. ఇప్పుడు జానీ మాస్టర్

మొన్నటివరకు రాజ్ తరుణ్, లావణ్య వివాదం ఏ రేంజ్ లో నడిచిందో అందరం చూశాం. ఆ వివాదానికి సంబంధించి మినిమం గ్యాప్ లో ఆడియో క్లిప్స్, ఫొటోలు లీక్ అయ్యాయి. వాటిపై యూట్యూబ్ ఛానెళ్లలో…

మొన్నటివరకు రాజ్ తరుణ్, లావణ్య వివాదం ఏ రేంజ్ లో నడిచిందో అందరం చూశాం. ఆ వివాదానికి సంబంధించి మినిమం గ్యాప్ లో ఆడియో క్లిప్స్, ఫొటోలు లీక్ అయ్యాయి. వాటిపై యూట్యూబ్ ఛానెళ్లలో చర్చావేదికలు కూడా నడిచాయి. ఇప్పుడు జానీ మాస్టర్ వంతు.

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్, పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఓ కొరియోగ్రాఫర్ ను అత్యాచారం చేశాడని, ఆ టైమ్ కు ఆమె మైనర్ అనేది కేసు. ఇప్పుడు దీనికి సంబంధించి లీకులు మొదలయ్యాయి.

జానీ మాస్టర్ డ్రైవర్, బాధితురాలితో మాడ్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ ను తను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నానని, బాధితురాలు అందులో మాట్లాడినట్టు ఉంది.

“జానీ మాస్టర్ ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ అక్కకు తెలిసిపోయింది. ఆయనిచ్చిన రింగ్ నా వేలికే ఉంది. మరో 2 రింగ్స్, ఓ చైన్ ఉన్నాయి. ఆయనిచ్చిన నెక్లెస్ కూడా ఉంది. కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమను. నేను ఆయన చేతికే ఇస్తాను. ఆయనకు నేను వాచ్ ఇచ్చాను. అది మాత్రం నాకొద్దు. నేను ప్రేమతో ఇచ్చిన బహుమతిని వెనక్కు తీసుకోను. అక్కర్లేదనుకుంటే చెత్తబుట్టలో పడేయమను.”

న్యూ ఇయర్ వచ్చినా, బర్త్ డే వచ్చినా తనకు జానీ మాస్టరే గుర్తొస్తున్నాడని.. అందుకే ఆ జ్ఞాపకాల్ని తను ఎప్పటికప్పుడు తన ఎకౌంట్ లో పెడతానని అంటోంది బాధితురాలు. ఆ వీడియోలు చూసి జానీ మాస్టర్ డిస్టర్బ్ అవ్వాలని, తనకు అదే కావాలని ఆమె ఫోన్ సంభాషణలో స్పష్టంగా చెబుతోంది.

ఎప్పుడు ఈ సంభాషణ జరిగిందనేది తెలియదు కానీ బాధితురాల్ని కార్నర్ చేసే విధంగా ఈ ఆడియో క్లిప్ ఉంది. మరో 2 రోజుల్లో మధ్యంతర బెయిల్ తో జానీ మాస్టర్ బయటకు రాబోతున్న వేళ, ఈ ఆడియో క్లిప్ లీక్ అవ్వడం సంచలనంగా మారింది. జానీ మాస్టర్ పై సింపతీ క్రియేట్ చేసేందుకు ఎవరో కావాలనే ఈ ఆడియోను లీక్ చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు జానీ మాస్టర్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాధితురాలితో చర్చలు జరిపి, తెరవెనక ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారట.

ఈ మొత్తం వ్యవహారంలో గమ్మత్తైన విషయం ఏంటంటే.. రాజ్ తరుణ్ వివాదంలో ఊహించని విధంగా తెరపైకొచ్చి యూట్యూబ్ ఛానెళ్లలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఆర్ జే బాషా, ఇప్పుడీ వివాదంలో కూడా విశ్లేషకుడిగా మారడం. చాలా ఛానెళ్లకు ఈ వివాదంపై మాట్లాడేందుకు అతడే స్పెషల్ గెస్ట్ అయిపోయాడిప్పుడు.

2 Replies to “మొన్న రాజ్ తరుణ్.. ఇప్పుడు జానీ మాస్టర్”

Comments are closed.