మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రుల‌య్యారు. తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు తాజాగా కోహ్లీ, అనుష్క సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. రెండో బిడ్డ‌కు అకాయ్…

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రుల‌య్యారు. తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు తాజాగా కోహ్లీ, అనుష్క సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. రెండో బిడ్డ‌కు అకాయ్ గా నామ‌క‌ర‌ణం చేశామ‌న్నారు.

ఈ టైంలో అంద‌రి ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ ప్రైవ‌సీని గౌరవించాలని కోరారు. కాగా విరాట్‌, అనుష్క 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. జ‌న‌వ‌రి 11, 2021న అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు.

కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య జ‌రుగుతున్న‌ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల అతను సిరీస్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈసారి ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే కోహ్లి ఆర్సీబీ తరపున ఆడుతూ మళ్లీ మైదానంలో కనిపించనున్నారు.