చిరంజీవిపై మళ్లీ బాలయ్య పంచ్

కొంతమంది కలిసి భూములు పంచుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలయ్య.. ఈసారి పరోక్షంగా చిరంజీవిపై కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి చెప్పిన “మంచి మైకులో చెప్పాలి-చెడు చెవిలో చెప్పాలి” డైలాగ్ ను…

కొంతమంది కలిసి భూములు పంచుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలయ్య.. ఈసారి పరోక్షంగా చిరంజీవిపై కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి చెప్పిన “మంచి మైకులో చెప్పాలి-చెడు చెవిలో చెప్పాలి” డైలాగ్ ను వెటకారం చేశారు. అలా చేస్తే ఎవడికి ఉపయోగం ఉంటూ సూటిగా ప్రశ్నించారు.

“చెడు చెవిలో చెప్పాలా.. మంచి మైకులో చెప్పాలా.. ఎందుకు? చెవిలో చెడు చెబితే ఏం చేస్తాడు. అంతర్మథనం పొందడం తప్ప. వాడు చెడు చేశాడు కాబట్టి మనం తిట్టాం కాబట్టి వాడు బాగుపడ్డాడనే తృప్తి ఉండాలి కదా. అది కూడా ఓ సేవ కదా. చెడు చెవిలో చెప్పడానికి నేనన్న మాట (భూములు పంచుకుంటున్నారని) ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఒకరి పేరు నేను చెప్పలేదు కదా. అందర్నీ కలిపి అన్నాను.”

దాసరి తర్వాత ఆ పెద్దరికాన్ని తీసుకోవడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా బాలయ్య సెటైర్లు  వేశారు. ఇండస్ట్రీలో దాసరి లేని లోటును భర్తీ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని… కానీ ఒక్క శాతం కూడా ఆ లోటు భర్తీ అవ్వలేదన్నారు.

“దాసరి లేని లోటును వంద శాతం మిస్ అవుతున్నాం. ఆయన స్థానాన్ని ఎవ్వరూ ఒక్క శాతం కూడా భర్తీ చేయలేకపోతున్నారు. ఆయన శిష్యుడు కల్యాణ్ ఉన్నంతలో చేస్తున్నారు. గురువుగారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే.. ఇంకెవరూ లేరు.”

కొంతమంది భూములు పంచుకుంటున్నారనే వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు బాలయ్య. మీడియా అడిగితేనే ఆ మాట అన్నానని, అప్పటివరకు దాన్ని తన మనసులోనే పెట్టుకున్నానని అంటున్నారు. ఇండస్ట్రీకి ఓ పెద్ద దిక్కు ఉండాలని, కానీ దాసరి స్థానాన్ని భర్తీ చేయాలనుకోవడం భ్రమ అన్నారు బాలయ్య.

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు