ఆ పుకార్ల‌లో నిజం లేదంటున్న బ్యూటీ

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ముఖ్యంగా హీరోయిన్ల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతుంటాయి. వాటిలో నిజాల కంటే అబ‌ద్ధాలే ఎక్కువ ఉంటాయి. గ్లామ‌ర్ రంగంలో నిప్పు లేకుండా కూడా పొగ వ‌స్తుంద‌ని చెబుతారు.  Advertisement తాజాగా త‌న‌పై వ‌స్తున్న ప్ర‌చారానికి…

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ముఖ్యంగా హీరోయిన్ల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతుంటాయి. వాటిలో నిజాల కంటే అబ‌ద్ధాలే ఎక్కువ ఉంటాయి. గ్లామ‌ర్ రంగంలో నిప్పు లేకుండా కూడా పొగ వ‌స్తుంద‌ని చెబుతారు. 

తాజాగా త‌న‌పై వ‌స్తున్న ప్ర‌చారానికి సంబంధించి టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క్లారిటీ ఇచ్చారు. అందులో ఎంత మాత్రం నిజం లేద‌ని చెప్పుకొచ్చారామె. ఇంత‌కూ ఏమా ప్ర‌చారం? ఏమా నిజం? ఆ సంగతుల‌ను తెలుసుకుందాం.

అక్కినేని స‌మంత ఓటీటీ వేదిక‌పై వ్యాఖ్యాత‌గా త‌న‌ను కొత్త గెట‌ప్‌లో ఆవిష్క‌రించుకున్న సంగ‌తి తెలిసిందే.  ముఖ్య అతిథిగా వ‌చ్చిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ను స‌మంత ఇంట‌ర్వ్యూ చేశారు. 

ఇందుకు సంబంధించిన ప్రోమోలో ఆస‌క్తిక‌ర విష‌యాలు ఆమె చెప్పుకొచ్చారు. కొన్ని విష‌యాల‌కు సంబంధించి త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ర‌కుల్‌ ఓ క్లారిటీ ఇచ్చారు.

మీడియా, సోష‌ల్ మీడియాలో మీపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఎందుకు స్పందించ‌ర‌ని స‌మంత ప్ర‌శ్నించారు. ర‌కుల్ స్పందిస్తూ ….పుకార్లు పుట్టించే వారు ఎలాంటి ఆలోచ‌న లేకుండా చేస్తుంటార‌న్నారు. 

అంతెందుకు ప్ర‌స్తుతం ఉంటున్న ఇల్లు కూడా ఎవ‌రో గిఫ్ట్‌గా ఇచ్చార‌నే ప్ర‌చారం మీడియాలో విస్తృతంగా సాగుతోంద‌న్న విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఎవ‌రో ఇల్లు ఇస్తే, మ‌రి తానెందుకు శ్ర‌మించాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. 

అయితే ఇలాంటి పుకార్లు రావ‌డం ఇదే తొలిసారి కాద‌న్నారు. అందుకే వాటిని ప‌ట్టించుకోకూడ‌ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్టు ర‌కుల్ తెలిపారు. మ‌న ప‌నే అన్నింటికి స‌మాధానం చెబుతుంద‌ని ర‌కుల్ తెలివిగా స‌మాధానం ఇచ్చారు.  

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?