బోయపాటి మల్టీవర్స్.. సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు

హాలీవుడ్ లో పాపులరైన మల్టీవర్స్ కల్చర్ ను ఆల్రెడీ సౌత్ లోకి తీసుకొచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఒక సినిమాలో పాపులర్ అయిన హీరో పాత్రను లేదా విలన్ పాత్రను, మరో సినిమాలో కూడా…

హాలీవుడ్ లో పాపులరైన మల్టీవర్స్ కల్చర్ ను ఆల్రెడీ సౌత్ లోకి తీసుకొచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఒక సినిమాలో పాపులర్ అయిన హీరో పాత్రను లేదా విలన్ పాత్రను, మరో సినిమాలో కూడా వాడకం లోకేష్ నుంచే పాపులర్ అయింది. ఇప్పుడీ మల్టీవర్స్ లోకి బోయపాటి శ్రీను కూడా ఎంటర్ అయినట్టు కనిపిస్తోంది.

ఈరోజు రిలీజైన స్కంద సినిమా క్లయిమాక్స్ లో తను చెప్పాల్సిన విషయాన్ని పరోక్షంగా చెప్పాడు బోయపాటి. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అధికారికంగా సీక్వెల్ ప్రకటించిన ఈ దర్శకుడు.. మొరాకో మాఫియాను టచ్ చేస్తూ సీక్వెల్ తీయబోతున్నాననే విషయాన్ని వెల్లడించాడు. అందులో తన సినిమాల్లోని మరో పాత్రను అతడు చొప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ సంగతి పక్కనపెడితే, సీక్వెల్స్ ట్రెండ్ లోకి బోయపాటి కూడా చేరినట్టయింది. ఇప్పటికే అఖండ పార్ట్-2 తీస్తానని ప్రకటించిన ఈ డైరక్టర్, స్కంద సినిమా చివర్లో ఏకంగా పార్ట్-2 పోస్టర్ వదిలాడు.

అయితే ఇదే సమయంలో బోయపాటి తీసుకున్న నిర్ణయంపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. స్కంద సినిమాలోనే ఎలాంటి కథ లేదని, కేవలం ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ తో నెట్టుకొచ్చారని, ఇలాంటి సినిమాకు పార్ట్-2 అవసరమా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే సినిమా సక్సెస్ అయితే ఈ విమర్శలన్నీ కొట్టుకుపోతాయి. ఆటోమేటిగ్గా సీక్వెల్ పట్టాలపైకి వస్తుంది. మరి స్కంద ఆ రేంజ్ కు వెళ్తుందా.. సీక్వెల్ చేసే అర్హత సాధిస్తుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..