Advertisement

Advertisement


Home > Movies - Movie News

బంద్ కు చెక్ పెట్టిన బాలయ్య!

బంద్ కు చెక్ పెట్టిన బాలయ్య!

ఈ రోజు టాలీవుడ్ లో ఓ గమ్మత్తయిన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అంతా గిల్డ్ నే అనుకున్న వ్యవహారం కాస్తా, ఛాంబర్ నే సుప్రీమ్..కౌన్సిల్ నే టాప్ అంటూ మారిపోయంది. బంద్ కాదు..విరామం అంటూ కొత్త భాష్యం వినిపించింది. త్వరలో అంతా ముగిసిపోతుంది అంటూ చెప్పుకువచ్చారు. అప్పటికప్పుడు ఏం జరిగింది? అన్నది ఆరా తీస్తే దీని వెనుక సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వున్నారని తెలుస్తోంది.

ఆయన చేస్తున్న జై బాలయ్య సినిమా షెడ్యూలు విదేశంలో జరగాల్సి వుంది. అలాగే ఓ షెడ్యూలు హైదరాబాద్ లో జరగాల్సి వుంది. ఇవి ఆగిపోయాయి. ఇప్పటికే బాలయ్య నిర్మాణ సంస్థ మైత్రీకి ఓ నెల గడువు పెంచినట్లు బోగట్టా. ఇది కాగానే అనిల్ రావిపూడి సినిమా సెట్ మీదకు వెళ్లడానికి రెడీ గా వుంది. అది కాక అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలుపెట్టాలి. ఇవి కాక ఆయన పొలిటికల్ యాక్టివిటీ వుండనే వుంది.

దాంతో నిన్నటికి నిన్న నిర్మాతలను పిలిచి బాలకృష్ణ గట్టిగా మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. తనకు మరింత టైమ్ ఇచ్చే అవకాశం లేదని, వెంటనే షూటింగ్ పెట్టమని చెప్పినట్లు బోగట్టా. 

దీంతో కిందా మీదా పడిన నిర్మాతలు, గిల్డ్ పెద్దలు, కౌన్సిల్ చాంబర్ పెద్దలతో కలసి చర్చించారని, కొందరు వెళ్లి బాలయ్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారని తెలుస్తోంది. వీలయినంత త్వరలో ఈ బంద్ ముగిస్తామని బాలయ్యకు మాట ఇచ్చి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హీరో నాని తన షూటింగ్ ఆపనని చెప్పారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి బాలకృష్ణ తోడయితే పరిస్థితి వేరుగా వుంటుంది. అందుకే గిల్డ్ ను పక్కన పెట్టి, కౌన్సిల్, చాంబర్ తో కలిసి సాఫ్ట్ అండ్ స్మూత్ ఎగ్జిట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?