Advertisement

Advertisement


Home > Movies - Movie News

చైతూ కోసం తండ్రీ కొడుకులు

చైతూ కోసం తండ్రీ కొడుకులు

హీరో నాగ చైతన్య తన 22 సినిమాను కూడా ప్రారంభించేసాడు. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై  శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. 

కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరు కలిసి సంగీతం చేస్తున్న మొదటి చిత్రమిది. 

ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ తో పాటు సెలబ్రిటీలు శివకార్తికేయన్, గంగై అమరన్, యువన్ శంకర్ రాజా, ప్రేమ్‌జీ  హాజరయ్యారు.  

లీడ్ పెయిర్‌పై చిత్రీకరించిన ముహూర్తానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్‌ ఇవ్వగా, ఇండియా రానా దగ్గుబాటి కెమెరా స్విచాన్ చేసారు. దర్శకుడు భారతి రాజా , "ది వారియర్" దర్శకుడు ఎన్ లింగుసామి, స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నాగ చైతన్య కు మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. జులై నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?