అగ్ర‌హీరోకు మ‌ళ్లీ పాజిటివ్‌

టాలీవుడ్ అగ్ర‌హీరో, మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ క‌రోనాబారిన ప‌డ్డారు. ఆయ‌న క‌రోనా పాజిటివ్‌కు గురి కావ‌డం ఇది రెండోసారి. త‌న‌కు పాజిటివ్ అనే విష‌యాన్ని తాజాగా ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. త‌న‌కు క‌రోనా…

టాలీవుడ్ అగ్ర‌హీరో, మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ క‌రోనాబారిన ప‌డ్డారు. ఆయ‌న క‌రోనా పాజిటివ్‌కు గురి కావ‌డం ఇది రెండోసారి. త‌న‌కు పాజిటివ్ అనే విష‌యాన్ని తాజాగా ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. త‌న‌కు క‌రోనా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు ఆయ‌న తెలిపారు. 

ప్ర‌స్తుతం తాను హోంఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు చిరు తెలిపారు. అలాగే గ‌త కొన్ని రోజులుగా త‌న‌ను క‌లిసిన వారంతా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని చిరంజీవి కోరారు. త్వ‌ర‌లోనే అంద‌ర్నీ క‌లుస్తాన‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

గ‌తంలో ఆయ‌న క‌రోనా బారిన ప‌డడం తెలిసిందే. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ఉద్దేశంతో కోవిడ్ టెస్ట్ చేయించు కున్నారు. పాజిటివ్ అని తేలింది. ఈ సంగ‌తిని అప్ప‌ట్లో చిరంజీవి తెలిపారు. ఇది 2020, న‌వంబ‌ర్ 9న జ‌రిగింది. ఆ తర్వాత ఆయ‌న కోలుకుని సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఆచార్య సినిమాలో త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా ఉండ‌డం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కానుంది. నిజానికి సంక్రాంతికి సినిమా విడుద‌ల కావాల్సింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆచార్య‌తో ప‌లు పెద్ద సినిమాలు కూడా వాయిదాప‌డ్డాయి. చిరంజీవి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.