ఈసారి క్రిస్మస్ కి కూడా పోటీ తప్పేలా లేదు

సాధారణంగా క్రిస్మస్ ను లైట్ తీసుకుంటుంది టాలీవుడ్. అయితే ఈమధ్య ఓవర్సీస్ ను దృష్టిలో పెట్టుకొని క్రిస్మస్ రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి, దీపావళి, దసరా లాంటి అకేషన్స్ తో పోల్చి చూస్తే..…

సాధారణంగా క్రిస్మస్ ను లైట్ తీసుకుంటుంది టాలీవుడ్. అయితే ఈమధ్య ఓవర్సీస్ ను దృష్టిలో పెట్టుకొని క్రిస్మస్ రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి, దీపావళి, దసరా లాంటి అకేషన్స్ తో పోల్చి చూస్తే.. ఈ స్లాట్ లో పోటీ తక్కువే. కానీ ఇప్పుడిప్పుడే క్రిస్మస్ పై కూడా టాలీవుడ్ ఫోకస్ పెరిగింది. ఇందులో భాగంగా ఈ ఏడాది క్రిస్మస్ కు అప్పుడే 3 సినిమాలు సిద్ధమయ్యాయి.  

క్రిస్మస్ సీజన్ పై ముందుగా కర్చీఫ్ వేసిన హీరో నాని. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకుడు. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. హీరోకి, అతడి చిన్నారి కూతురికి మధ్య సాగే అనుబంధంతో ఎమోషనల్ గా ఈ సినిమా సీతారామం ఫేమ్ మృణాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రలో శృతిహాసన్ కనిపించనుంది.

ఈ మూవీతో పాటు వెంకీ నటించిన శైంధవ్ కూడా క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. శైలేష్ కొలను డైరక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా కొన్ని ప్రత్యేకతలున్నాయి. నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నారు. రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాధ్, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పుడీ క్రిస్మస్ రేసులోకి తాజాగా హరోంహర అనే సినిమా కూడా వచ్చి చేరింది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న డిఫరెంట్ యాక్షన్-థ్రిల్లర్ ఇది. ఇందులో చిత్తూరు యాసలో మాట్లాడుతూ, పక్కా మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను కూడా డిసెంబర్ 22నే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

క్రిస్మస్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. అంతలోనే ఇలా కొంతమంది హీరోలు కర్చీఫ్ లు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ రేసులోకి వచ్చి చేరుతాయో చూడాలి. అయినా ఇలా రిలీజ్ డేట్స్ ప్రకటించడం, ఆ తర్వాత తప్పుకోవడం టాలీవుడ్ లో కామన్. ఆ టైమ్ కు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయనేది ఓ నెల రోజుల ముందు వరకు తేలే వ్యవహారం కాదు.