స్వాతి విడాకులు తీసుకుందా.. ఆమె ఏమంటోంది?

ఏదో మీటింగ్ లో 'చెప్పను బ్రదర్' అన్నాడు అల్లు అర్జున్. పవన్ కల్యాణ్ పై స్పందించమని పదేపదే అతడి అభిమానులు సతాయిస్తుంటే, భరించలేక ఆ డైలాగ్ వాడాడు. ఇప్పుడు అదే డైలాగ్ ను నటి…

ఏదో మీటింగ్ లో 'చెప్పను బ్రదర్' అన్నాడు అల్లు అర్జున్. పవన్ కల్యాణ్ పై స్పందించమని పదేపదే అతడి అభిమానులు సతాయిస్తుంటే, భరించలేక ఆ డైలాగ్ వాడాడు. ఇప్పుడు అదే డైలాగ్ ను నటి కలర్స్ స్వాతి కూడా రిపీట్ చేస్తోంది. ఇకపై తన ఆన్సర్ అదే అంటోంది. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.

స్వాతి వైవాహిక జీవితంపై చాలామందికి డౌట్స్ ఉన్నాయి. పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిన తర్వాత, కొన్నాళ్లు ఆమె మ్యారీడ్ లైఫ్ బాగానే సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో, సడెన్ గా ఇండియా వచ్చేసింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, ఆ వెంటనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తిరిగి ఆమె తన భర్త దగ్గరకు వెళ్లలేదు.

ఇదే అంశంపై ఈరోజు స్వాతిని ప్రశ్నించింది మీడియా. భర్తతో కలిసే ఉంటున్నారా, విడాకులు తీసున్నారా, క్లారిటీ ఇవ్వమని సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అంతే సూటిగా సమాధానం ఇచ్చింది స్వాతి. 'నేను చెప్ప' అనేది ఆమె ఆన్సర్.

“నేను చాలా క్లియర్ గా చెబుతున్నాను. నా వైవాహిక జీవితంపై నేను స్పందించను. నేను చెప్పను అనేది నా ఆన్సర్. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అదృష్టంకొద్దీ సోషల్ మీడియా లేదు. ఉండి ఉంటే అప్పట్లోనే నన్ను ఫుట్ బాల్ ఆడుకునేవాళ్లు. ఇప్పుడు నటీనటులు, సోషల్ మీడియాను ఎలా హ్యాండిల్ చేస్తున్నారో నాకు తెలీదు. అందుకే ఓ ప్రొఫెషనల్ నటిగా నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. అందులో భాగంగా నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పను.”

ఇలా తన విడాకులపై వచ్చిన పుకార్లపై స్పందించడానికి నిరాకరించింది స్వాతి. మంత్ ఆఫ్ మధు సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈ నటి, సినిమా కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని, మంచి పాత్రలు చేయాలని ఉందని తెలిపింది.