సాయితేజ్ చెప్పొచ్చు.. సమంత చెప్పకూడదా!

సమంతపై సోషల్ మీడియా డిస్కషన్ కొత్త కాదు. నాగచైతన్య నుంచి విడిపోయినప్పట్నుంచి ఆమెపై ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. మొన్నటికిమొన్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున నెటిజన్లు ముచ్చట్లు పెట్టారు. తాజాగా…

సమంతపై సోషల్ మీడియా డిస్కషన్ కొత్త కాదు. నాగచైతన్య నుంచి విడిపోయినప్పట్నుంచి ఆమెపై ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. మొన్నటికిమొన్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున నెటిజన్లు ముచ్చట్లు పెట్టారు. తాజాగా సమంత ఆరోగ్యం అంశం మరోసారి చర్చకొచ్చింది.

శాకుంతలం సినిమా విడుదల టైమ్ లో సమంత మరోసారి తన ఆరోగ్య పరిస్థితి, అప్పటి అనారోగ్య పరిస్థితుల గురించి మాట్లాడింది. కేవలం తన సినిమాకు మైలేజీ తీసుకొచ్చేందుకు మాత్రమే సమంత ఇలా సింపతీ కార్డు వాడుతోందంటూ కొన్ని కథనాలు పుట్టుకొచ్చాయి.

దీనిపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కొత్త డిస్కషన్ పెట్టారు. ఈరోజు విరూపాక్ష రిలీజైంది. ఇందులో నటించిన సాయిధరమ్ తేజ్, ఆ సినిమా ప్రచారంలో భాగంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయితేజ్ నటించిన సినిమా ఇది.

ఈ అంశాన్ని సమంత అభిమానులు తెరపైకి తీసుకొస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి సాయిధరమ్ తేజ్ చెప్పొచ్చు కానీ, సమంత చెప్పకూడదా అని ప్రశ్నిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

సాయిధరమ్ తేజ్, సమంత ఇద్దరూ తమ ఆరోగ్య పరిస్థితి గురించి తమ సినిమాల ప్రచారంలో భాగంగా స్పందించిన మాట వాస్తవమే. కానీ అది వాళ్లు కావాలని చేయలేదు. మీడియా అడిగితేనే వాళ్లు స్పందించారు. పైగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని సమంత సందేశం ఇస్తే, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సాయితేజ్ మెసేజ్ ఇస్తున్నాడు. ఇది మంచిదే కదా.

పైగా సమంత సింపతీ కార్డు పనిచేయలేదు కదా. ఈమాత్రం దానికే సోషల్ మీడియాలో ఇంత చర్చ లేపడం సరైన పద్ధతి కాదంటున్నారు చాలామంది నెటిజన్లు. రేపు మరో సినిమా రిలీజ్ టైమ్ లో కూడా సమంత, సాయిధరమ్ తేజ్ ఈ టాపిక్ ను లేవనెత్తితే అది సింపతీ కిందకు వస్తుందని, ఇప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదంటున్నారు.