బ్రేక‌ప్ త‌ర్వాత చైత‌న్య‌…ఫ‌స్ట్ టైం!

నాగచైత‌న్య‌తో విడిపోయాక స‌మంత చాలా త్వ‌ర‌గానే కోలుకున్నారు. సాధార‌ణ జీవితంలోకి ఆమె వ‌చ్చారు. త‌న కెరీర్‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకునే ప‌నిలో స‌మంత బిజీ అయ్యారు. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో కూడా ఆమె ఎప్ప‌ట్లాగే యాక్టీవ్‌గా…

నాగచైత‌న్య‌తో విడిపోయాక స‌మంత చాలా త్వ‌ర‌గానే కోలుకున్నారు. సాధార‌ణ జీవితంలోకి ఆమె వ‌చ్చారు. త‌న కెరీర్‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకునే ప‌నిలో స‌మంత బిజీ అయ్యారు. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో కూడా ఆమె ఎప్ప‌ట్లాగే యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో నాగ‌చైత‌న్య బ్రేక‌ప్ త‌ర్వాత ఫ‌స్ట్ టైం సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

స‌మంత‌తో బ్రేక‌ప్ త‌ర్వాత మొద‌టిసారి ఇన్‌స్టాలో నాగ‌చైత‌న్య చేసిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. అది కూడా ఓ పుస్త‌కంపై కావ‌డం విశేషం. సాధార‌ణంగా చై సినిమాలు, బైకులు, కార్ల గురించి మిన‌హా, ఇత‌ర సంగ‌తుల‌పై సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డు. అలాంటిది చైని క‌ట్టి ప‌డేసిన ఆ పుస్తకం ఏంటో తెలుసుకుందాం.

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ మాథ్యూ రాసిన 'గ్రీన్‌ లైట్స్‌' అనే పుస్తకాన్ని షేర్‌ చేసిన చైతూ ఆస‌క్తిక‌ర‌ కామెంట్‌ చేశాడు. 'లవ్‌ లెటర్స్‌ టూ లైఫ్‌..మీ జర్నీని షేర్‌ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్‌ లైట్ (జీవితంలో ముందుకు వెళ్లడం)' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. 

ప్రేమ, జీవితం గురించి కామెంట్స్ చేశాడంటే… అందులో త‌న జీవితాన్ని ట‌చ్ చేసే అంశాలేవో ఉన్నాయ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.