క్రేజీ బయోపిక్ లో ధనుష్.. అధికారిక ప్రకటన

ఇళయరాజా బయోపిక్ రాబోతోందని, అందులో ధనుష్ నటించబోతున్నాడనే చర్చ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఇళయరాజా బయోపిక్ తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో ఇళయరాజాగా ధనుష్ కనిపించబోతున్నాడు. Advertisement ఇళయరాజా…

ఇళయరాజా బయోపిక్ రాబోతోందని, అందులో ధనుష్ నటించబోతున్నాడనే చర్చ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఇళయరాజా బయోపిక్ తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో ఇళయరాజాగా ధనుష్ కనిపించబోతున్నాడు.

ఇళయరాజా బయోపిక్ కు సంబంధించి స్క్రిప్ట్-స్క్రీన్ ప్లే వర్క్ పూర్తయింది. సినిమాలో మంచి ఎమోషనల్ టచ్ ఉందట. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ఇళయరాజా కెరీర్ లో, జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల్ని చూపిస్తారట.

మరికొన్ని రోజుల్లో ధనుష్ పై లుక్ టెస్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి రాదు. ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి, వచ్చే ఏడాది చివర్లో ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకొస్తాడు ధనుష్. 2025 సమ్మర్ తర్వాత సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

తమిళ్ లో హిట్టయిన ఇళయరాజా పాటల్ని, తమిళ బయోపిక్ లో.. తెలుగులో హిట్టయిన పాటలను తెలుగు బయోపిక్ లో పెట్టబోతున్నారు. ఇలా తెలుగు, తమిళ వెర్షన్లకు విడివిడిగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే రాయడం విశేషం.

ఈ సినిమాలో గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం పాత్ర కూడా ఉంది. ఆ పాత్రను ఎవరితో చేయిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కనెక్ట్ మీడియా, మెర్కురీ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.