ప్రభాస్ సినిమా కోసం వినూత్న ప్రచారం

ఇప్పుడున్న పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేస్తే పని జరగదు. జనాల్ని ఆకర్షించాలంటే ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించాల్సిందే. నలుగురు మాట్లాడుకునేలా చేయాల్సిందే. ఓ టీవీ ఛానెల్ అదే పని చేసింది. భీమవరం జనాల్ని…

ఇప్పుడున్న పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేస్తే పని జరగదు. జనాల్ని ఆకర్షించాలంటే ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించాల్సిందే. నలుగురు మాట్లాడుకునేలా చేయాల్సిందే. ఓ టీవీ ఛానెల్ అదే పని చేసింది. భీమవరం జనాల్ని కొత్తగా ఆకర్షించింది.

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. 26వ తేదీన టీవీల్లో ప్రసారం చేయబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం వినూత్నంగా ఆలోచించింది సదరు ఛానెల్. భీమవరంలో ఏకంగా రాధేశ్యామ్ థీమ్ పార్క్ ను ఏర్పాటు చేసింది.

రాధేశ్యామ్ లో ప్రభాస్-పూజాహెగ్డే ఓ ట్రయిన్ లో కలుసుకుంటారు. ఓ సాంగ్ లో పూజాహెగ్డే పియానో వాయిస్తుంది. ఇక  క్లయిమాక్స్ లో షిప్ కీలకంగా మారుతుంది. వీటన్నింటినీ థీమ్ పార్క్ లో ఏర్పాటుచేశారు. 26న రాధేశ్యామ్ సినిమా తమ ఛానెల్ లో వస్తోంది చూడండి అని చెప్పడం కోసమే ఇదంతా.

థియేటర్లలో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఓటీటీలో కూడా ఆదరణ అంతంతమాత్రంగానే దక్కింది. కనీసం టీవీల్లోనైనా ఈ సినిమా క్లిక్ అయితే పండగ చేసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ సినిమాకు టీవీల్లో మంచి రేటింగ్ వస్తే, జీ తెలుగు ప్రచారం ఫలించినట్టే.