Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ప్రాజెక్ట్' కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం

'ప్రాజెక్ట్' కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం

ఉన్నట్టుండి సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయమైపోతుంటాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత కొన్నాళ్లకు సడెన్ గా మళ్లీ తెరపైకొస్తుంటాడు. ఇప్పుడీ డైరక్టర్ మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. ఈసారి తను తీస్తున్న ప్రాజెక్ట్-కె అప్ డేట్స్ బయటపెట్టాడు.

సినిమాకు సంబంధించి ప్రభాస్ పై ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో ఓ బిట్ ను షూట్ చేశాడట నాగ్ అశ్విన్. ఆ విషయాన్ని వెల్లడిస్తూనే, మూవీ అప్ డేట్స్ కూడా తెలిపాడు. అయితే అదే సమయంలో రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వడం కుదరదంటున్నాడు. దానికి అతడు రీజన్ కూడా చెప్పాడు.

"ప్రాజెక్ట్-కె సినిమాకు సంబంధించి ఇప్పుడే ఒక షెడ్యూల్ అయింది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ ఇంట్రోకు సంబంధించిన ఓ చిన్న బిట్ కూడా షూట్ చేశాం. అది చాలా బాగా వచ్చింది. ప్రభాస్ చాలా కూల్ గా కనిపించాడు. జూన్ నెలాఖరు నుంచి మరో కొత్త షెడ్యూల్ ఉంటుంది. ప్రభాస్ సినిమాల లిస్ట్ లో చూసుకుంటే ప్రాజెక్ట్-కె ఆఖర్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వడం కుదరదు. కానీ కచ్చితంగా మంచి అప్ డేట్స్ తోనే ముందుకొస్తాం. ఈ  సినిమా కోసం అందరం ప్రాణంపెట్టి పని చేస్తున్నాం."

ప్రాజెక్ట్-కె కు ఇచ్చిన గ్యాప్ లో సలార్ సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నాడు ప్రభాస్. ఈనెల 24 నుంచి సలార్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో మొదలవుతుంది. దాదాపు 3 వారాల పాటు సాగే ఈ భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సలార్ టీజర్ పై ప్రకటన రానుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?