ఇండియ‌న్ 2: మృతుల‌కు ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూడా రూ.కోటి

ఇండియ‌న్ 2 మూవీ సెట్స్ మీద జ‌రిగిన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌న అసిస్టెంట్లు ముగ్గురికీ కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారాన్ని ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. సంఘ‌ట‌న జ‌రిగిన వారం రోజుల అనంత‌రం శంక‌ర్ స్పందించాడు. …

ఇండియ‌న్ 2 మూవీ సెట్స్ మీద జ‌రిగిన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌న అసిస్టెంట్లు ముగ్గురికీ కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారాన్ని ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. సంఘ‌ట‌న జ‌రిగిన వారం రోజుల అనంత‌రం శంక‌ర్ స్పందించాడు.  ఆ ప్ర‌మాదం షాక్ నుంచి త‌ను కోలుకోలేక‌పోతున్న‌ట్టుగా శంక‌ర్ చెప్పాడు. త‌న అసిస్టెంట్ల విష‌యంలో శంక‌ర్ స్పందించాడు. వారిలో కృష్ణ అనే అసిస్టెంట్ కేవ‌లం నెల రోజుల ముందు మాత్ర‌మే త‌న వ‌ద్ద చేరాడ‌ని శంక‌ర్ పేర్కొన్నారు. త‌ను ఒక మంచి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అని కితాబిచ్చారు. అయితే ఇంత‌లోనే అత‌డు దుర్ఘ‌ట‌న‌కు బ‌లి కావ‌డం విషాద‌క‌ర‌మ‌ని శంక‌ర్ పేర్కొన్నారు. అత‌డి త‌ల్లి వేధ‌న త‌న‌ను క‌లిచి వేసింద‌ని శంక‌ర్ వివ‌రించారు.

అలాగే ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చంద్ర‌, ప్రొడ‌క్ష‌న్ బాయ్ మ‌ధు ల మ‌ర‌ణం ప‌ట్ల కూడా శంక‌ర్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆ షాక్ నుంచి త‌ను ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని శంక‌ర్ చెప్పారు. ఇక మృతుల కుటుంబాల‌కు శంక‌ర్ కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. ప్ర‌మాదం నుంచి ఈ ద‌ర్శ‌కుడు కూడా త్రుటిలో బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టుగా తెలుస్తోంది.

మృతుల‌కు ఈ సినిమా హీరో క‌మ‌ల్ హాస‌న్ కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. ఈ సినిమా ప్రొడ్యూస‌ర్లు మృతుల కుటుంబాల‌కు రెండు కోట్ల రూపాయ‌ల చొప్పున‌, గాయ‌ప‌డిన వారి ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను పెట్టుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం